ప్రజాపక్ష పోరులో యువతరం నడుంబిగించి ముందుకు సాగుతూ పార్టీ పట్ల యువత విద్యార్థులను ఆకర్షించే దిశగా పోరాటాలకు శ్రీకారం చుట్టాలి

 గుంటూరు (ప్రజా అమరావతి)!

ఎన్టిఆర్ స్పూర్తితో మహానాడు వేదికగా యువరక్తంతో తెలుగుయువత తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి సమరోత్సహంతో ముందుకు సాగాలని గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.


     గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు సన్నాహంగా గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుయువత కమిటీ సభ్యులు మరియు నియోజకవర్గాల తెలుగుయువత అధ్యక్షులతో ముఖ్య అతిదులుగా గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, గుంటూరు పశ్చిమ టిడిపి ఇంచార్జ్  కోవెలమూడి రవీంద్ర (నాని) గారు, అర్బన్ టిడిపి అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మానుకొండ శివప్రసాద్ గారు, పార్టీ కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య గారు, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగులమీరా (బాబు), టిడిపి మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ ఘని లతో కలిసి తెలుగుయువత కమిటి సమావేశం నిర్వహించారు. అనంతరం కమిటి సభ్యులకు జిల్లా టిడిపి అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ గారి చేతులమీదగా పార్టీ కొత్త సభ్యత్వం అందజేశారు.


*గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ* 


ప్రజాపక్ష పోరులో యువతరం నడుంబిగించి ముందుకు సాగుతూ పార్టీ పట్ల యువత విద్యార్థులను ఆకర్షించే దిశగా పోరాటాలకు శ్రీకారం చుట్టాల


ని యువత తల్చుకుంటే సాధ్యం కానిది ఏది ఉండదని జాబులిస్తామని ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని ఆశ చూపి ఏవిధంగా ప్రభుత్వం మోసగించిందో యువతకు సవివరంగా తెలియజేస్తూ స్వామి వివేకానందాను ఆదర్శంగా  యువత సన్మార్గంలో ఆదర్శ రాజకీయాలకు బాటలు వేయాలని కోరారు. ఎన్.టి.ఆర్ స్పూర్తితో మహానాడు వేదికగా యువరక్తంతో తెలుగుయువత తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి సమరోత్సహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా జిల్లా తెలుగుయువత కమిటి సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే  

ఐ టిడిపి సేవలను వినియోగించుకోవాలని తెలియజేసారు. 


*గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ* 


పార్టీ సభ్యత్వం తీసుకున్న తెలుగు యువత కమిటీ సభ్యులకు కార్డులు తయారుచేసి పంపిణి చేయడం ఎంతో అభినందనీయమన్నారు. సభ్యత్వ నమోదులో తెలుగు యువత చురుకైన పాత్రతో సత్తా చాటాలని మహానాడును జయప్రదం చేసేందుకు క్రింది స్థాయి కార్యకర్త నుండి ముఖ్య నాయకుల వరకు రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం భయపడే విధంగా భారీ స్థాయిలో జయప్రదం చేయాలనీ ఏ పార్టీకి లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకే సొంతమన్నారు.    


*గుంటూరు అర్బన్ టిడిపి అధ్యక్షుడు డేగల ప్రభాకర్ మాట్లాడుతూ* 


మహానాడుకు గుంటూరు అర్బన్ పరిధిలోని ప్రతి వార్డు నుండి ఎన్ని అవాంతరాలు ఎదురైనా స్వచ్చందంగా తరలివెళ్లి గుంటూరు తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలని ఎక్కడికక్కడ వార్డు స్థాయి నుండి ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా తరలి వెళ్లాలని కోరారు. 


*తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ* 


మహానాడుకు జిల్లానుండి 100 మంది స్వచ్చందంగా తరలి వెళ్తున్నామని రాబోవు రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పైన ప్రజలను ఆలోచింపజేసేవిధంగా రాజీలేని పోరాటానికి తెలుగుయువత శ్రీకారం చుట్టి తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావటానికి తమవంతుగా ప్రధాన పాత్ర పోషిస్తామని నూతనోత్సాహంతో సమరశంఖం పురిస్తామని అన్నారు.


*తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ మాట్లాడుతూ* 


గతంలో ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగితే రావాలి జగన్ కావాలి జగన్ అని ఓట్లేసిన ప్రజలు ఈరోజు పోవాలి జగన్ దిగిపోవాలి జగన్ అని ఎదురు చూస్తున్నారన్నారు. ఏవిధంగా అయితే యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసారో దానిని నిరుద్యోగ లోకం జీర్ణించుకోలేకపోతుందని... తిరిగి రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు.    


     ఈ కార్యక్రమంలో టిడిపి ప్రచార కార్యదర్శి నాయుడు ఓంకార్, తెలుగుయువత జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నాగులమీరా (బాబు), ఉపాధ్యక్షులు కొల్లిమర్ల రాము, చాగంటి సత్యహర్ష, కొండెపు శేఖర్ బాబు, కన్నసాని బాజీ, అధికార ప్రతినిధులు ముంగమూరి హైమారావు, సింగు గోపి కృష్ణ,సింగంశెట్టి శివకుమార్, షేక్ షుకూర్, సీఫ్ మహమ్మద్, తప్పెట్ల ప్రేమ్ చంద్, ప్రచార కార్యదర్శి చెరుకుపల్లి నాగరాజు, కార్యనిర్వాహక కార్యదర్శులు మన్నెం శ్రీనివాసరావు, షేక్ ఖాసీం, కార్యదర్శులు బొక్కా లక్ష్మణ్, మాచవరపు దాసు, ఈదర త్రినాధ్, పఠాన్ హఠావుల్లాఖాన్, గ్యాలం హనుమంతరావు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మువ్వా కృష్ణ సాయి, ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు నాగిశెట్టి నాగరాజు, మండల అధ్యక్షులు మానుకొండ బ్రహ్మాజీ, యదాలా గణేష్, గుంటూరు పశ్చిమ ప్రధాన కార్యదర్శి ఉంగుటూరు ధర్మారావు, తూర్పు ప్రధాన కార్యదర్శి మస్తాన్ రావు, గాలి శ్రీనివాస్ గౌడ్, పొందూరి బాలాజీ, మాజీ జడ్పిటిసి పాములపాటి శివన్నారాయణ, మేడికొండూరు మండల పార్టీ అధ్యక్షుడు మల్లిపెద్ది రమేష్  తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image