పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి: సీఎం



అమరావతి (ప్రజా అమరావతి);

*–పరిశ్రమల శాఖపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


*–పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్లు, పరిశ్రమలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*



*మూడేళ్లలో గణనీయ పారిశ్రామికాభివృద్ధి:*

1.

– గడచిన మూడేళ్లలో పారిశ్రామిక ప్రగతిని వివరించిన అధికారులు

–మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించిన భారీ, అతిభారీ యూనిట్లు 96

– ఉత్పత్తి ప్రారంభించిన ఎంఎస్‌ఎంఈలు 28,247

– మొత్తంగా మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు 28,343

–ఈ పరిశ్రమల రూపేణా వచ్చిన పెట్టుబడులు రూ. 47,490.28కోట్లు

– 2,48,122 మందికి ఉద్యోగాలు. 


2.

– నిర్మాణంలో ఉన్న కంపెనీలు భారీ, అతిభారీ పరిశ్రమలు 61

– పెట్టుబడి రూ.1,51,372 కోట్లు

– ఈ పరిశ్రమల్లో ఉద్యోగాల సంఖ్య 1,77,147


3.

– నిర్మాణ పనులు మొదలుపెట్టనున్న యూనిట్లు సంఖ్య 5. 

– తద్వారా పెట్టుబడి రూ.1,365.88 కోట్లు

– ఉద్యోగాల సంఖ్య 8,850


4.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న పరిశ్రమల సంఖ్య – 92

 –ఈ పరిశ్రమల ద్వారా రానున్న పెట్టుబడుల మొత్తం : రూ.  2,19.766 కోట్లు

– తద్వారా భారీగా ఉపాధి కల్పన, 3,19,829 మందికి ఉద్యోగాలు. 



*మౌలికసదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి:*

– పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి: సీఎం


– దీనివల్ల వీలైనంత త్వరగా పరిశ్రమలు తమ పనులను ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుంది: సీఎం

– విశాఖపట్నం – చెన్నై కారిడర్‌లో భాగంగా ఉన్న నక్కపల్లి నోడ్, కాళహస్తి నోడ్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్టు తెలిపిన అధికారులు. 


*ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం:*

– సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి:

– ఎంఎస్‌ఎంఈలకు చేదోడుగా నిలవాలి:

– పారిశ్రామిక ప్రోత్సహకాలు వారికి అందేలా చూడాలి:

– దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇచ్చారన్న అ«ధికారులు

– ప్రోత్సాహకాలకోసం గత ప్రభుత్వం పెట్టిన బకాయిలనూ చెల్లించామన్న సీఎం. 

– ప్రతి ఏటా.. క్రమం తప్పకుండా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న సీఎం. 

– క్లస్టర్‌ పద్ధతిలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాలి:

– ఒకే తరహా ఉత్పత్తులు అందిస్తున్న గ్రామాలు కూడా ఉన్నాయి:

– వీటిని కూడా క్లస్టర్‌గా గుర్తించి, వారికి అండగా నిలవాలి:

– ఎంఎస్‌ఎంఈలకు అత్యుత్తమ సేవలు ఈ రాష్ట్రంలో అందాలి:


*ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కాలుష్య నివారణ:*

– కాలుష్య నివారణలో ఎంఎస్‌ఎంఈలకు చేదోడుగా నిలవాలి:

– ఎంఎస్‌ఎంఈలు ఉన్నచోట కాలుష్య జలాలశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి:

– పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించాలి:

– ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగిన స్థాయిలో ఉన్నాయా? లేవా? అన్నది చూడాలి:

– ప్రత్యేక నిధి ద్వారా కాలుష్య నివారణ వ్యవస్థలను పారిశ్రామిక వాడల్లో బలోపేతం చేయాలి:

– సంబంధిత యూనిట్లకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసే రీతిలో విధానాన్ని తీసుకురావాలి:

– దీనివల్ల పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించగలుగుతాం:

– పారిశ్రామిక వాడల్లో పనిచేసే వారంతా మన కార్మికులే:

– ఆ కార్మికుల ఆరోగ్యాలను, పరిసరాలను, పరసరాల్లో నివాసం ఉండేవారి ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది:


*పారదర్శక పారిశ్రామిక విధానం...*

– పారదర్శకంగా పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నాం:

–నీళ్లు, విద్యుత్, రోడ్లు, రైల్వేలైన్లకు సంబం«ధించిన మౌలిక సదుపాయాలు మనం కల్పిస్తాం :

– నిజాయితీగా మనం చెప్పింది చేస్తున్నాం:

– ఏది చేయగలుగుతామో అదే చెబుతున్నాం, ఏది చెబుతున్నామో అదే చేస్తున్నాం :

– ఎవ్వరికీ కూడా మోసం చేసే మాటలు చెప్పడంలేదు:

–మనం చేసే పనులలో నిజాయితీ ఉంది కాబట్టి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు:

– రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి:

– భజాంకాలు, బంగర్లు, సింఘ్వీలు, బిర్లాలు లాంటి వారంతా రాష్ట్రానికి వస్తున్నారు:

– అదానీకూడా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు :

– తమ ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధితో అడుగులు ముందుకేస్తున్నారు:

– కారణం మనం చేయగలిగినదే చెప్తున్నాం :

–ఇక్కడకు వచ్చిన తర్వాత పూర్తిస్ధాయి మద్ధతు ఇస్తున్నాం :


*గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులతో భారీగా ఉపాధికల్పన:*

– గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా పెద్ద మొత్తంలో ఉపాధి లభించనుంది:

– వీటిపై ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి:

– దాదాపు 66వేల ఎకరాలకుపైగా భూమిని ఈ ప్రాజెక్టులకు వినియోగించాల్సి ఉంటుంది:

– అర హెక్టార్‌ కన్నా తక్కువ భూమి ఉన్న జనాభా రాష్ట్రంలో 50 శాతం ఉండగా... ఒక హెక్టర్‌ కంటే తక్కువ భూమి ఉన్నవారు 70 శాతం ఉన్నారు :

– ఈ ప్రాజెక్టుల ద్వారా బీడు భూములున్న వారికి మంచి ఆదాయం రానుంది:

– ఇలాంటి భూములను లీజు విధానంలో తీసుకుని, వారికి ప్రతిఏటా కూడా ఎకరాకు దాదాపు రూ.30వేల డబ్బు చెల్లించేలా విధానం తీసుకు వస్తున్నాం:

– అంతేకాక రైతుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు కల్పించేదిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం:

– గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుల కారణంగా సుమారు 30 వేలమందికిపైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది:


– పంప్డ్‌ స్టోరేజీ పవర్‌కి వాల్యూ అడిషన్‌ చేస్తున్నాం:

– గ్రీన్‌ హైడ్రోజన్, అమ్మెనియా తయారీలపై దృష్టిపెట్టాం:

– దీనివల్ల గ్రీన్‌ఎనర్జీ రంగంలో చాలా ముందడుగు వేస్తాం: 

 – పర్యావరణానికి కూడా మంచిది :

– దీనికి సంబంధించి కూడా పాలసీలు తయారుచేయాలి :


– ఇథనాల్‌ తయారీపైనకూడా దృష్టిపెట్టాలి:

– రాష్ట్రంలో విస్తృతంగా ధాన్యం పండిస్తున్నారు:

–బియ్యాన్ని వాడుకుని ఇథనాల్‌ తయారీపై దృష్టిపెట్టాలి:

– ఆయిల్‌పాం ప్రాససింగ్‌ యూనిట్లపైనాకూడా ప్రత్యేక దృష్టిపెట్టాలి:

– దీనిపై మంచి విధానాలు తీసుకురావాలి:

– త్వరలో విశాఖపట్నంలో  ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు నిర్వహాణకు సమాయాత్తమవుతున్నామన్న అధికారులు. 


ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి గుడివాడ అమర్నా«థ్‌, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జి సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జె సుబ్రమణ్యం, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌  కె వెంకటరెడ్డి, ఏపీ టీపీసీ చైర్మన్‌ కె రవిచంద్రారెడ్డి, మారిటైం బోర్డు సీఈఓ షన్‌మోహన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments