అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.

 *అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.*


*ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్*


*దావులూరు గ్రామం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.*


కొల్లిపర (ప్రజా అమరావతి);

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడమే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తోన్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. గురువారం దావులూరు గ్రామంలో   గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొని ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు లబ్ధిదారులకు ఇప్పటి వరకూ అందిన పథకాలను గణాంకాలతో వివరించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు రోడ్లు, డ్రైనేజి కాలువల నిర్మాణం,  సమస్యలను ఎమ్మెల్యే శివకుమార్ దృష్టికి తీసుకువచ్చారు.  రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను వీలైనంత త్వరగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని సంబంధిత  శాఖ అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ గత మూడేళ్ల కాలంలో కొల్లిపర మండలం లో కోట్లాది రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. , నియోజకవర్గంలో  అర్బన్ హెల్త్ సెంటర్లు, సచివాలయ భవనాల నిర్మాణాలు, . ఇంటి వద్దకే  ప్రభుత్వ పథకాలను అందజేస్తోన్న వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి  అండగా నిలిచి రానున్న ఎన్నికల్లో మరో మారు విజయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో , తహశీల్దార్ బి. నాంచారయ్య, ఎంపీడీవో పి. శ్రీనివాసులు, ఏ.ఓ వెంకట్రావు,  ఎస్సై.


బలరాం రెడ్డి, ఎంపీపీ భీమవరపు. సంజీవ రెడ్డి పద్మావతి, వైస్ .ఎంపీపీ అద్దంకి. బోసు బాబు, సర్పంచ్, సచివాలయ సిబ్బంది, మండల వైసీపీ అధ్యక్షులు ఆరిగ. చంద్రారెడ్డి, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Comments