రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
సీఎం శ్రీ వైఎస్ జగన్ను కలిసిన పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి.
నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్గా గుర్తింపు తెచ్చుకున్న జాహ్నవి.
రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని కలిసి...పైలెట్ ఆస్ట్రొనాట్ అవ్వాలన్న తన కోరికను వివరించి, ఇందుకు అవసరమైన శిక్షణకు అయ్యే ఖర్చుకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసిన జాహ్నవి.
భారత సంతతికి చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్పంతో ముందుకెళుతున్నట్లు సీఎంకి వివరించిన జాహ్నవి.
జాహ్నవి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జాహ్నవి కుటుంబ సభ్యులు.
addComments
Post a Comment