మదనపల్లె, అన్నమయ్య జిల్లా (ప్రజా అమరావతి);
*మదనపల్లె మహానాడు సభలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం:-*
• టిడిపి 40 ఏళ్లు పూర్తి చేసుకుంది...ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం.
• ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు...ఒక వ్యవస్థ...శక్తి. తెలుగు వారు అందరూ ఆరాధించే వ్యక్తి ఎన్టీఆర్.
• రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టిన వారు ఎన్టీఆర్
• ఆడబిడ్డలకు ఆస్థి హక్కు వంటి సంస్కరణలు తెచ్చిన నేత ఎన్టీఆర్
• మూడేళ్ల వైసిపి పాలనలో ఎన్నో కష్టాలు పడ్డాం. లేని సమస్యలు సృష్టించారు.
• మదనపల్లి సభకు ప్రజలు రాకుండా అనేక అడ్డంకులు సృష్టించారు.
• నేను కన్నెర్ర చేస్తే ఈ వైసిపి నేతలు ఇంట్లోంచి బయటకు రారు.
• వైసిపి దోపిడీని ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా....కేసులు పెడతారా?
• ఒక్క చాన్స్ ఇవ్వమని జగన్ పాదయాత్ర చేశాడు....నాడు నేను వద్దు అనుకుంటే జగన్ పాదయాత్ర చేసేవాడా?
• నేను ప్రజాస్వామ్య వాదిని...చేతగాని వ్యక్తిగా చూడవద్దు.
• పాదయాత్రలో ఊరూరూ తిరిగి ముద్దులు పెట్టి...ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు జగన్
• పేదల పిల్లలు కూడా చదువుకోవాలని...ఉన్నత ఉద్యోగాలు చెయ్యాలని పని చేసిన ప్రభుత్వం టిడిపి
• నాడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్....పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజ్ లతో విద్యకు అవకాశాలు కల్పించాం.
• టిడిపి హయాంలో ఐటి, టీచర్, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే...జగన్ వాలంటీర్ల ఉద్యోగం ఇచ్చాడు.
• ఉమ్మడి ఎపిలో 1.60 లక్షల మంది టీచర్లను రిక్రూట్ చేసింది మనమే
• అమ్మఒడి పేరుతో జగన్ మోసం చేశాడు...ఇప్పుడు ఆంక్షలు పెట్టాడు.
• 300 యూనిట్ల కరెంట్ వాడితే అమ్మఒడి రాదు..అమ్మఒడి ఒక బూటకంగా మారింది
• నేను తిరుపతిలోనే ఎంఎ ఎకనమిక్స్ చదివాను...జగన్ ఎక్కడ చదివారో వైసిపి నేతలు చెపుతారా?
• అమ్మఒడి బూటకం..ఇంగ్లీషు మీడియం ఒక నాటకం...నాడు నేడు అవినీతి మయం
• పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వమే కారణం
• జగన్ స్కూళ్ల మూసివేత పని మొదలు పెట్టాడు...తాను చదువుకోలేదు....ఎవరినీ చదువుకోనివ్వడు.
• పిల్లలు వాగులు వంకల్లో నడిచి పాఠశాలకు వెళ్లాలా?
• అన్నా చెల్లి ఉంటే ఇద్దరు కలిసి బడికి వెళ్లి వస్తారు...ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు.
• టీచర్లపై కోపంతో విద్యా వ్యవస్థను జగన్ నాశనం చేస్తున్నాడు
• 8 వేల గ్రామాల్లో స్కూళ్లు మూసేశారు.
• ఈ స్కూళ్లు మూసివేస్తే కేంద్రం నుంచి అప్పులు వస్తాయని జగన్ కక్కుర్తిపడి పాఠశాలలు మూసివేశాడు.
• పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ ప్రభుత్వ విధానాలను మహానాడు వేదికగా ఖండిస్తున్నాం
• ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మహానాడు వేదికగా తీర్మానం
• మీ గ్రామంలో స్కూలు మూసివేస్తే వైసిపి నేతలను ఊరికి రానివ్వకండి
• బాదుడే బాదుడుతో జగన్ నడ్డి విరుస్తున్నాడు.
• అన్ని పొరుగు రాష్ట్రాల కంటే ఎపిలోనే ఆర్టీసి రేట్లు ఎక్కువ
• వంట గ్యాస్ కొనే పరిస్థితి లేదు....మళ్లీ కట్టెల పొయ్యే శరణ్యం
• అన్ని నిత్యావసర వస్తువులు పెరిగాయి.
• ఆంధ్ర గోల్డ్, నైన్ సీ హార్స్, సిల్వర్ స్ట్రైప్స్ మద్యంలో హానికర పదార్థాలు ఉన్నాయి.
• ఈ బ్రాండ్స్ తాగిన వారు తీవ్ర ఆనారోగ్యం పాలవుతున్నారు.
• జగన్ సొంత డిస్టలరీలు పెట్టుకున్నాడు...రేట్లు విపరీతంగా పెంచాడు.
• టిడిపి హానికర బ్రాండ్ల వివరాలు బయటపెట్టగానే...వాటి అమ్మకం ఆపేశారు.
• నెలకు రెండు వందల కోట్లు అక్రమార్జన కోసం నాసిరకం మద్యంతో జనం ప్రాణాలు తీస్తున్నారు.
• వడ్రంగి పనులకు, లాండ్రీ పనులకు కూడా పన్ను వేసేందుకు జగన్ సిద్దం అయ్యాడు.
• చేతి వృత్తుల వారిపై 5 వేల కోట్లు పన్నులు వేసేందుకు సిఎం సిద్దం అయ్యాడు
• ప్రజా వేదిక నాది కాదు...ప్రజల సొమ్ము. దాన్ని కూల్చి వేశారు. ప్రజలు ఇలాంటి అంశాలపై స్పందించాలి.
• ప్రభుత్వంపై పోరాటానికి ఇంటికి ఒకరు సిద్దంగా ఉండాలి. కేసులకు భయపడకండి.
• తమ జీవితాలను నాశనం చేసిన సిఎంను యువత వదిలిపెట్టకూడదు
• జాబ్ క్యాలెండర్ లేదు..స్కూళ్లు మూసేశారు....ఉపాధి లేదు.
• నిరుద్యోగ బృతి ఇచ్చాం....విదేశీ విద్య ఇచ్చాం...
• జగన్ కుమార్తెలు ప్యారిస్ లో, లండన్ లో చదవాలి...మన పిల్లలు వాగులు వంకలు దాటి వెళ్లాలా
• జగన్ పెట్టిన ప్రతి కేసుపై చిత్ర గుప్తుడిలా లెక్కలు రాస్తున్నా...అధికారం లోకి వచ్చిన తరువాత అన్నింటికీ తిరిగి చెల్లిస్తాం.
• కొందరు పోలీసులు తప్పుడు పనులు చేస్తున్నారు....తప్పుడు పనులు చేయమని అధికారులు చెప్పాలి.
• చోడవరం సభలో పోలీసుల సమస్యలపై మాట్లాడితే....వారి కి నిధులు విడుదల చేశారు.
• రాష్ట్రంలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు....డ్రిప్ కు సబ్సిడీ రావడం లేదు
• రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చెయ్యాలి అనుకున్నాం...ఇప్పుడు విత్తనాలు కూడా లేవు.
• క్రాప్ ఇన్స్యూరెన్స్ ను కూడా రైతులకు ఇవ్వకుండా వైసిపి దొంగలు తింటున్నారు.
• జగన్ వచ్చి మూడేళ్లు అయ్యింది....హంద్రీనీవా పనులు ఏమయ్యాయి...జిల్లాలో నీళ్లు ఇచ్చారా
• రాజంపేట పార్లమెంట్ లో రౌడీయిజం చెయ్యడానికి ఈ ప్రాంతం ఈ మంత్రి జాగీరు కాదు.
• పుంగనూరులో దాడులు చేస్తున్నారు...తంబళ్ల పల్లిలో అక్రమ కేసులుపెట్టి అరెస్టు చేశారు.
• టిడిపి నేతలపై దాడులు పిరికిపంద చర్యలు కాదా...మాకు దాడి చెయ్యడం రాదా
• పదవులు, కాంట్రాక్టులు, ఇసుక, లిక్కర్ అన్ని ఈ మంత్రికే రావాలి
• ఇక్కడ ప్రతిపాదించిన పనులు ప్రజల కోసం కాదు...ఈ వైసిపి నాయకుల కోసం
• ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు సొంత కంపెనీలకు పనులు ఇవ్వవచ్చా.
• రాష్ట్రంలో ఎక్కువ మోటార్లు ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా....అలాంటి మోటార్లకు మీటర్లు పెడుతున్నారు...మీరు అంగీకరించకండి.
• మోటార్లకు మీటర్లు పెడితే రైతుపైనే భారం పడుతుంది....మీటర్లు అవసరం లేదు.
• ప్రభుత్వం అప్పుల కోసం రైతుల మొడకు ఉరితాళ్లు వెయ్యవద్దు
• జగన్ పాలనలో బిసిలు తీవ్రంగా దెబ్బతిన్నారు....వారి కోసం ఒక్క రూపాయి ఖర్చు చెయ్యలేదు.
• జగన్ ఇచ్చిన 50 బిసి కార్పొరేషన్ లలో ఒక్క రూపాయి లోన్ ఇచ్చారా.
• ఎస్ సి, ఎస్టీలకు 28 పథకాలు రద్దు చేశారు.
• మైనారిటీ యువతులకు ఇచ్చిన దుల్హన్ పథకం, రంజాన్ తోఫా రద్దు చేశారు.
• జగన్ 8 లక్షల కోట్ల అప్పులు చేశారు....ఒక్కొ ఇంటిపై 7 లక్షల కోట్ల అప్పు.
• అప్పుల సొమ్ము అంతా ఎటుపోయింది....ఒక్క రోడ్డు వేశారా...ఒక్క గుంత పూడ్చారా
• ఒక్క ఊరిలో మూడేళ్లలో ఒక డ్రైనేజీ కట్టలేని జగన్...మూడు రాజధానులు కడతాను అంటున్నాడు
• 72 శాతం పూర్తి అయిన పోలవరం ప్రాజెక్టును నిలిపివేశారు.
• రాయలసీమ లిఫ్ట్ అని జగన్ నాటకాలు ఆడారు....ఆస్కీం ఏమయ్యింది?
• పుంగనూరు చిత్తూరు జిల్లాకు ఎలా వెళ్లింది...పుంగనూరు కూడా అన్నమయ్య జిల్లాకు రావాలి.
• మదనపల్లి ని జిల్లా చెయ్యాలనే డిమాండ్ పై మీకు న్యాయం చేస్తా.
• జిల్లాల విభజనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దుతాం.
• ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతా అన్నాడు...ఇప్పుడు జగన్ మెడలు దించుకున్నాడు
• విభజన చట్టంలో హమీల కోసం జగన్ ఏం చేశాడు.
• జగన్ ను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే 600 మందిపై కేసులుపెట్టారు....180మందిని అరెస్టు చేశారు.
• అక్రమ కేసులు పెట్టిన అధికారులను ఖచ్చితంగా భవిష్యత్ లో శిక్షిస్తాం.
• వివేకా హత్య లో నాపై ఇష్టం వచ్చినట్లు రాసిన సాక్షిపై కేసు పెట్టారా...భారతీ రెడ్డిని అరెస్టు చేస్తారా.
• వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులనే బెదిరించారు.
• ప్రధాని మీటింగ్ కు రావాల్సిన ఎంపి రఘురామరాజును అడ్డుకున్నారు.
• ఎంపి రఘురామ రాజు ట్రైన్ లో వస్తే ట్రైన్ తగలబెట్టి హత్య చేస్తారని భయపడి ఆయన ప్రధాని సభకు రాలేదు
• నాపై కేసులుపెట్టిన ఒకే ఒక వ్యక్తి పిచ్చి జగన్ రెడ్డి...తిక్క జగన్ రెడ్డి
• అమరావతికి వెళితే నా కాన్వాయ్ పై దాడి జరిగితే డిజిపి గా ఉన్న సవాంగ్ సమర్ధించారు
• ఇప్పుడు సవాంగ్ ఏమయ్యారు....అన్న అన్న అని నాడు పలిచి ఇప్పుడు పక్కనపెట్టారు
• మా ఇంటిపై దాడికి వైసిపి ఎమ్మెల్యే వస్తే వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు అన్నారు.
• జగన్ ప్రభుత్వంలో నవరత్నాలు కాదు...నవ ఘోరాలు.
• జగన్ మూడేళ్లలో లక్షా 75 వేల కోట్ల అవినీతి చేశాడు...లిక్కర్, ఇసుక, భూముల్లో దోచుకున్నాడు
• సాక్షి కోసం 300 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చాడు.
• అప్పుడు నష్టాల్లో ఉన్న సాక్షిపేపర్...ఇప్పుడు లాభాల పంట
• మదనపల్లి నుంచి వెళ్లాల్సిన రైల్వే లైను ను పులివెందుల మీదుగా తీసుకువెళ్లాలి అని చూశాడు.
• రైల్వే లైన్ మార్చితే అంగీకరించేది లేదు.
• అధికారంలో వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తా.
• మదనపల్లెలో 500 కోట్ల విలువైన ల్యాండ్ కొట్టేసే ప్రయత్నం జరుగుతుంది.
• స్థలాన్ని స్థానిక ప్రజలు కాపాడుకోవాలి....మదనపల్లి జిల్లా కేంద్రం అయితే కార్యాలయం అక్కడే పెడదాం.
• మదనపల్లి మహానాడును విజయవంతం చేసిన అన్నమయ్య జిల్లా ప్రజలకు ధన్యవాదాలు.
addComments
Post a Comment