జగనన్నను చల్లాగా ఉండాలని దీవించండి.!!



గూడూరు (పోలవరం) జూలై, 27 (ప్రజా అమరావతి);


*గడప గడపలో శతాధిక వృద్దురాలిని పరామర్శించిన మంత్రి జోగి రమేష్ గారు.*


*జగనన్న మనకు ఆస్తి ఇచ్చాడు మనం ఏమిద్దాం అంటూ లబ్దిదారులను ప్రశ్నించిన మంత్రి.*


*'జగనన్నను చల్లాగా ఉండాలని దీవించండి.!!*



*అన్నం పెట్టే, గూడు కట్టించే జగనన్నను చల్లగా ఉండాలని దీవించండి అంటూ రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ గడప గడపకు కార్యక్రమంలో ప్రజలను కోరారు.*


గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం గూడూరు మండలం పోలవరం గ్రామంలో మంత్రి జోగి రమేష్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న పథకాల లబ్ది తెలియజేస్తూ జగనన్నకు మీ ఆశీస్సులు కావాలంటూ విజ్ఞప్తి చేశారు.


ఉరకలేసిన ఉత్సహంతో మంత్రి అధికారులు, సచివాలయ సిబ్బందితో కలసి పోలవరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి నమస్తే తల్లీ అంటూ వివిధ పథకాల క్రింద వారు పొందిన లబ్ది వివరాలతో ప్రభుత్వం ముద్రించిన బుక్ లెట్స్ ఇంటింటికి అందజేశారు. 


ప్రతి ఇంటిలో వారు ఏ ఏ పథకాల క్రింద లబ్దిపొందారో చదివి వినిపించి ఈ పథకాలు ఎవరు ఇచ్చారని ప్రశ్నించగా జగనన్న అని సమాదానం ఇచ్చారు. 


*ఈ క్రమంలో ఒక ఇంటిలో మంచంపై పడుకుని ఉన్న 110 సంవత్సరాల వయస్సు గల శతాధిక వృద్ధురాలు వుట్ల సుబ్బనాగమ్మను మంత్రి పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈమె వైయస్ఆర్ పింఛను కానుక క్రింద ఇప్పటి వరకు 77,500 లబ్ది పొందినట్లు, ఇంటిస్థలం విలువ 2.50 లక్షలు మొత్తం 3,27,500 రూ.లు లబ్దిపొందినట్లు వృద్దురాలకు తెలియజేసి ఆశీస్సులు అందజేయాలని కోరారు.*



ఇదే గ్రామంలో పేరక కోటసుబ్బారావు, సావిత్రి దంపతులు గృహానికి చేరుకున్న మంత్రి వీరు పొందిన పధకాలు చదివి వినిపించారు. ఆరోగ్యశ్రీ పథకం క్రింద రూ.1,36,071, ఇంటి స్థలం 2.50 లక్షలు, ఇల్లు మంజూరు 2 లక్షలతో పాటు వైయస్ఆర్ ఆసరా, జగనన్న చేయూత, నేతన్ననేస్తం, వైయస్ఆర్ పింఛన్లు పధకాల క్రింద రూ.2,20,250 మొత్తం 8,06,321 రూ.లు | లబ్దిపొందినట్లు మంత్రి తెలిపారు. ఇంత చేసిన జగనన్నకు ఆశీస్సులు అందజేయాలని కోరారు.


గడప గడప పర్యటనలో గ్రామంలో చిన్నారులతో కొద్ది సేపు ముచ్చటించారు. మీ స్కూలులో మధ్యాహ్నం భోజనం బాగుంటున్నదా, మధ్యాహ్నం భోజనం ఎవరు పెడుతున్నారు. అమ్మఒడి డబ్బులు ఎవరు ఇస్తున్నారని చిన్నారులను ప్రశ్నించారు. లబ్దిదారులు బుక్స్ జగన్ పోటో చూపించి ఈయన ఎవరని ప్రశ్నించగా జగన్ అని సమాదానం ఇచ్చారు. మీరు బాగా చదువుకోవాలని పుస్తకాలు ఇస్తున్నారని, పాఠశాలలు బాగుచేయిస్తున్నారని వివరించారు.


గ్రామంలో కేదారేశ్వరపురం కొత్త కాలనీలో రోడ్లు వేయించాలని మువ్వల వెంకటేశ్వరరావు తదితరులు కోరగా రోడ్ల అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 


గ్రామంలో జగనన్న కాలనీలో 240 మందికి ఇళ్ల పట్టాలు అందజేయగా 50 మంది వరకు ఇళ్లు మొదలు పెట్టుకున్నారని, అంతర్గత రోడ్ల అభివృద్ధి చేయాలని కోరగా అంచనాలు రూపొందించాలని నిధులు మంజూరు చేయిస్తామన్నారు.


గూడూరు ఎంపిపి సంఘ మధుసూదనరావు, జడ్పిటిసి వేముల సురేష్ రంగబాబు, స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షుడు తలుపులు కృష్ణారావు, వైస్ ఎంపిపి పిచ్చుక గంగాధరరావు, ఎంపిడివో డి. సుబ్బారావు. ఎంఇవో దుర్గా ప్రసాద్, ఇవో ఆర్ డి ఎం.డి రజావుల్లా, డిటి శివశంకర్, వివిధ శాఖల మండలాధికారులతో పాటు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.


                                

Comments