ట్రాఫిక్ మళ్లింపులు మరియు భారీ వాహనాల హోల్డింగ్ పాయింట్ల వివరాలు:

                

డి‌ఐ‌జి కార్యాలయం 

గుంటూరు  (ప్రజా అమరావతి);



గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, పెద్దకాకాని వద్ద జాతీయ ఎన్‌హెచ్-16  వద్ద జరిగే వై‌ఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలు, బహిరంగ సభకు సంబంధించి ట్రాఫిక్‌ను సక్రమంగా క్రమబద్ధీకరించడానికి వీలుగా సాధారణ ప్రజల సమాచారం కోసం దీని ద్వారా తెలియజేస్తున్నాము. 08-07-2022 ఉదయం 08:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు మరియు 09-07-2022న ఉదయం 08:00 గంటల నుండి రాత్రి 10:00   గంటల వరకు. కింది ట్రాఫిక్ మళ్లింపులు మరియు భారీ వాహనాల  హోల్డింగ్  పాయింట్ల వివరాలు:                

భారీ వాహనములు మరియు లారీల మళ్లింపులు :

             అన్ని భారీ వాహనములు మరియు లారీలను 08-07-2022 ఉదయం 08:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు  మరియు ది. 09.07.2022   ఉదయం 08గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ క్రింది ప్లీనరీ సదస్సు జరుగుతున్న జాతీయ రహదారిపైకి రాకుండా క్రింద సూచించిన మళ్ళించడం జరుగుతుంది.


1. చెన్నై వైపు నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు మరియు ఇబ్రహీంపట్నం, 

   నందిగామ, వైపుకు వెళ్ళు  భారీ గూడ్స్ వాహనములు ఒంగోలు జిల్లా  త్రోవగుంట వద్ద  

    నుండి  చీరాల- బాపట్ల – రేపల్లె- అవనిగడ్డ- పామర్రు – గుడివాడ –  హనుమాన్ జంక్షన్ 

   మీదుగా విశాఖపట్నం మరియు  ఇబ్రహీంపట్నం వైపుకు మళ్ళించడం జరుగుతుంది.


2. చెన్నై నుండి హైదరాబాద్ వైపు వెళ్ళే  వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ళు, 

     నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి  మీదుగా హైదరాబాద్ వెళ్ళవలెను.

3. చిలకలూరిపేట వైపు నుండి విశాఖపట్నం  వెళ్ళే వాహనాలను  చిలకలూరు పేట 

    నుండి NH-16 మీద  పెదనందిపాడు ,కాకుమాను, పొన్నూరు , చందోలు  , 

     చెరుకుపల్లి , భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – 

     హనుమాన్ జంక్షన్  మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.


4. చెన్నై నుండి విశాఖపట్నం  వెళ్ళే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద నుండి ఉన్నం 

    గ్రామం, ఏ.బి.పాలెం వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు , చందోలు  , చెరుకుపల్లి , 

    భట్టిప్రోలు , పెనుమూడి    బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – హనుమాన్ 

    జంక్షన్ మీదుగా  విశాఖపట్నం వైపు మళ్లించబడును.


5. గుంటూరు నుండి విశాఖపట్నం  వెళ్ళే వాహనాలను బుడంపాడు X మిధుగా తెనాలి, 

     వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్ , పెనుమూడి బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు 

    –  గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.

5. విశాఖపట్నం  వైపు నుండి చెన్నై వైపు వెళ్ళు లారీలు, భారీవాహనములు హనుమాన్ 

     జంక్షన్ వద్ద నుండి  గుడివాడ – పామర్రు -  అవనిగడ్డ – రేపల్లె- బాపట్ల – చీరాల – 

     త్రోవగుంట – ఒంగోలుజిల్లా  మీదుగా  మళ్ళించడం జరుగు తుంది.

6.  గుంటూరు వైపు నుండి విజయవాడ వచ్చు వాహనములు : గుంటూరు , తాడికొండ ,   

    తుళ్ళూరు , వెంకటపాలెం , యెర్రబాలెం , డాన్ బాస్కో స్కూల్ , ఉండవల్లి సెంటర్ , 

     తాడేపల్లి పెట్రోల్ బంక్, వారది మీదుగా విజయవాడ చేరుకోవలయును .


7. రాజమండ్రి నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనములు , దివాన్ చెరువు, 

     ధవళేస్వరం బ్రిడ్జి, కొవ్వూరు , జంగారెడ్డి గూడెం , అస్వరావు పేట , సత్తుపల్లి మీదుగా  

     మళ్ళించడం జరుగుతుంది.

8. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు లారీలు, భారీవాహనములు హనుమాన్ 

     జంక్షన్ వద్ద నుండి నూజివీడు- మైలవరం – జి కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు 

    మళ్ళించడం జరుగుతుంది.

9. గన్నవరం వైపు నుండి హైదరాబాద్ వెళ్ళు వాహనములు కేసరపల్లి , ముస్తాబాద్, 

    ఇన్నర్ రింగ్ రోడ్ , పైపుల రోడ్, ఇబ్రహింపట్నం వైపుకు మళ్ళించడం జరుగుతుంది.

10. హనుమాన్ జంక్షన్ వైపు నుండి హైదరాబాద్ వెళ్ళు వాహనములు గన్నవరం గాంధి 

    బొమ్మ,ఆగిరి పల్లి, జి కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్ళించడం జరుగుతుంది.

11.భారి సరుకు రావాణ వాహనములను-గన్నవరం, ఆగిరి పల్లి, జి కొండూరు,    

    ఇబ్రహీంపట్నం వైపు మళ్ళించడం జరుగుతుంది.

12. హైదరాబాద్ వైపు నుండి చెన్నై వైపు వెళ్ళే  వాహనాలు నార్కెట్ పల్లి , నల్గొండ, 

     మిర్యాలగూడ,  నడికుడి, పిడుగురాళ్ళు, అద్దంకి, మేదరమెట్ల మీదుగా చెన్నై 

      వెళ్ళవలెను.


13. హైదరాబాద్ వైపు నుండి విశాఖపట్నం వెళ్ళు లారీలు, భారీవాహనములు 

      ఇబ్రహీంపట్నం వద్ద నుండి జి -కొండూరు – మైలవరం-  నూజివీడు -హనుమాన్ 

       జంక్షన్ వద్ద నుండి అనుమతిస్తారు.

14. చెన్నై వైపు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే  multi-axel Goods వాహనాలను 

      ఎటువంటి మళ్లింపు లేకుండా జాతీయ రహదారి కి సమీపంలోని  చిలకలూరి పేట, 

       ఒంగోలు మరియు నెల్లూరు వద్ద నిలిపివేయబడును. ఆ వాహనాలను రాత్రి 10 గంటల 

      అనతరం వాహనాలను అనుమతిస్తారు.

15. విశాఖపట్నం వైపు నుండి చెన్నై వైపు వెళ్ళే multi-axel Goods వాహనాలను  

     హనుమాన్ జంక్షన్ వద్ద మరియు పొట్టిపాటు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారికి 

      సమీపంలో నిలిపివేయబడును. ఆ వాహనాలను రాత్రి 9 గంటల అనతరం వాహనాలను     

      అనుమతిస్తారు.

గుంటూరు వైపు నుండి ప్లీనరీ కి వచ్చే వారి వాహనాల పార్కింగ్ ప్రదేశం వివరాలు:

పాస్ట్రోల్ ట్రైనింగ్ సెంటర్ (నిర్మల సెంటర్ –కట్ ఆఫ్ ) మోటార్ ద్విచక్ర వాహనములు  -1500.

ఆంద్ర జ్యోతి ప్రింటింగ్ ప్రెస్ ఆవరణ –మోటార్ కార్లు – 20

అములోద్భావి హోటల్ – ౩౦౦ కార్లు 

జైన్ టెంపుల్ ఆవరణ-4 వీలర్స్ పార్కింగ్ 

దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్-4 వీలర్స్ పార్కింగ్

కంతేరు రోడ్డు-బస్సుల పార్కింగ్ 

నంబూరు రోడ్డు :భీమవరం గ్రాండ్ -

నంబూరు రోడ్డు-1:

నంబూరు రోడ్డు-2:

కేశవ రెడ్డి స్కూల్: 4 వీలర్స్ పార్కింగ్

కేశవ రెడ్డి స్కూల్ వెనుక -4 వీలర్స్ పార్కింగ్

కంతేరు రోడ్డు రైల్వే గేటు నుండి సాయి భారతి హోం వరకు- కార్ పార్కింగ్ 

రైల్వే గేటు దగ్గరలో సాయి భారతి హోం అపార్ట్మెంట్ ఎదురు గా వున్న అపార్ట్మెంటు - కార్ పార్కింగ్

కంతేరు రోడ్డు లో వైట్ ఫెన్సింగ్ ఖాళీ ప్రదేశము:

ఎడ్ల పందేముల ర్యాంప్ (15 ఎకరముల ఖాళీ ప్రదేశము )

పల్లలమ్మ చెరువు నుండి కంతేరు రోడ్డు (రోడ్ మార్జిన్):4 కి.మీ 

ఖలీల్ డాబా వెనుక వైపు : జనరల్ పార్కింగ్ 

బైబుల్ మిషన్ మైదానము రోడ్డు నెం.1: పోలీసు వాహనముల పార్కింగ్ 

పెంతెకోస్తు కాంపౌండ్ : 

హాయ్ లాండ్ 

కొప్పురావూరు రోడ్ 

పోలిశెట్టి టుబాకో కాంపౌండ్ :

NRI ఆసుపత్రి ప్రక్కన గల ఇసుక డంపింగ్ ప్రదేశము 

జాతీయ రహదారి సర్వీసు రోడ్ –కాజ గ్రామం నుండి దీపకా అండర్ పాస్ వంతెన వరకు 

జాతీయ రహదారి సర్వీసు రోడ్ –నంబూరు  గ్రామం నుండి పెదకాకాని వై జంక్షను వరకు 

విజయవాడ వైపు నుండి ప్లీనరీ కి వచ్చే వారి వాహనాల పార్కింగ్ ప్రదేశం వివరాలు:

ఆర్.కె.వేనుజియా పార్కింగ్ 

అను నార్త్ గేటు పార్కింగ్ 

అను మెయిన్ గేటు పార్కింగ్ 

అను సౌత్ గేటు పార్కింగ్ 

అయోధ్య రామిరెడ్డి & సన్స్ పంక్షన్ హాల్ ప్రదేశము 

వి.ఐ.పి మరియు వి.వి.ఐ.పి. వాహనాల పార్కింగ్ ప్రదేశం వివరాలు:

బైబుల్ మిషన్ భవంతి పశ్చిమ వైపున వున్న ప్రదేశము : MLAs/MPs/MLCs

మరియు Z.P.chair persons

JMJ స్కూల్ పార్కింగ్ : గౌరవనీయులైన ముఖ్య మంత్రివర్యుల కాన్వాయ్ వాహనముల పార్కింగ్. 

St.Anns. కాంపౌండ్ పార్కింగ్ 


మీడియా వారికి విజ్ఞప్తి: ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరియు FM స్టేషన్లుయొక్క ఎడిటర్‌లు మరియు డైరెక్టర్‌లందరికీ ప్రజల భద్రత దృష్ట్యా విస్తృత ప్రచారం/టెలికాస్ట్ చేయమనిఅభ్యర్థిస్తున్నాము.



                                                                                   డి‌ఐ‌జి, గుంటూరు.

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image