*వైద్య ఆరోగ్యశాఖపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని సీఎం ఆదేశం*
*ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.*
*ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశం.*
*విలేజ్ క్లినిక్స్కు, పీహెచ్సీలకు డిజిటల్ వీడియో అనుసంధానత ఉండాలన్న సీఎం.*
*కోవిడ్ పైనా సీఎం సమీక్ష.*
*ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్న సీఎం.*
*నూతన వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్న సీఎం*
*మెడికల్ కాలేజీల్లో వీలైనంత త్వరగా తరగతులు నిర్వహించేలా తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆదేశం.*
అమరావతి (ప్రజా అమరావతి);
*–వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*–ఆరోగ్యశ్రీపై సీఎం సమీక్ష*
– ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశం. దశలవారీగా అమలు చేయాలని నిర్ణయం
– విలేజ్ క్లినిక్స్కు, పీహెచ్సీలకు డిజిటల్ వీడియో అనుసంధానత ఉండాలన్న సీఎం.
– ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని సీఎం ఆదేశం.
– పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారుచేస్తామన్న అధికారులు.
– ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
– ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా 2446 చికిత్సలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వం.
– గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా కేవలం 1059 ప్రొసీజర్స్కు మాత్రమే చికిత్స.
– ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వర్చువల్ బ్యాంకు ఖాతాలు.
– ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి వర్చువల్ బ్యాంకు ఖాతాలోకి... అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపు.
– ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్ ఫాం, చికిత్స పూరై్తన తర్వాత ధృవీకరణ పత్రం.
– ధృవీకరణ పత్రంలో వైద్యంకోసం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలు. అలాగే రోగి కోలుకునేంతవరకూ ఆరోగ్య ఆసరా ద్వారా అందుతున్న సహాయం వివరాలు.
– రోగి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారా? పూర్తి ఉచితంగా వైద్యం అందిందా? అన్న విషయాలను కూడా ధృవీకరించేలా పత్రం.
– ఎవరైనా లంచం లేదా అదనపు రుసుము వసూలు చేసిన నేపథ్యంలో ధృవీకరణ పత్రంలో ఫిర్యాదులకోసం ఏసీబీకి కేటాయించిన టోల్ఫ్రీ నంబర్ 14400 లేదా 104 ఉంచాలని సీఎం ఆదేశాలు.
– రోగి ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన వారం తర్వాత ఆరోగ్య సిబ్బంది సంబంధిత గ్రామానికి వెళ్లి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిమీద విచారణ చేయాలని ఆదేశం.
– మరింత సహాయం అవసరమైన పక్షంలో సమన్వయం చేసుకుని ఆ సహాయం అందేలా చూడాలని సీఎం ఆదేశం.
– రోగికి అందిన సేవలు, అదనంగా కావాల్సిన మందులు, తదితర అంశాలపైన కూడా ఫోన్కాల్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్న సీఎం.
*మరింత పటిష్టంగా 108, 104 సేవలు...*
– 108, 104 లాంటి సర్వీసుల్లో కూడా లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం
– ఈ వాహనాలపైన ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంచాలని ఆదేశం.
*–రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపైనా సమీక్ష నిర్వహించిన సీఎం.*
– పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని వెల్లడించిన అధికారులు.
– అక్కడక్కడా కోవిడ్ కేసులు ఉన్నా.. ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య అతిస్వల్పమని తెలిపిన అధికారులు.
– కేవలం 69 మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నారని, వీరందరూ కూడా కోలుకుంటున్నారని తెలిపిన అధికారులు.
– ఇప్పటికే 87.15శాతం మందికి ప్రికాషన్ డోసు వేశామని తెలిపిన అధికారులు.
– ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్న సీఎం.
– ముఖ్యంగా 60ఏళ్ల పైబడ్డ వారికి ప్రికాషన్ డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్న సీఎం.
– 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి రెండోడోసు 99.69శాతం మందికి ఇచ్చామన్న అధికారులు.
– 12 – 14 ఏళ్ల మధ్యనున్న వారికి 98.93 శాతం రెండో డోసు పూర్తిచేశామన్న అధికారులు.
*సిబ్బంది నియామకంపైనా సమీక్ష.*
– ఆస్పత్రుల సామర్థ్యానికి సరిపడా వైద్యులు, సిబ్బంది నియామకంపై సీఎం రివ్యూ.
– రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 40,476 పోస్టులను ఈ ప్రభుత్వం వచ్చాక భర్తీచేశామన్న అధికారులు.
– జులై చివరినాటికల్లా సిబ్బంది నియామకాలు పూర్తిచేయాలన్న సీఎం.
– ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ కూడా ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది ఉండాలని స్పష్టంచేసిన సీఎం.
– ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా చూడాలని స్పష్టంచేసిన సీఎం.
– ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేంతోనే భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని, దాంట్లో భాగంగానే ప్రమాణాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించడంతోపాటు, నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడం, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్న సీఎం.
*–వైద్య ఆరోగ్య శాఖలో నాడు – నేడుపైనా సీఎం సమీక్ష.*
– పనుల్లో ప్రగతిని వివరించిన అధికారులు.
– 16 మెడికల్కాలేజీల్లోని 14 చోట్ల పనులు ప్రారంభమయ్యాయన్న అధికారులు.
– నర్సీపట్నంలో కూడా ఈనెలాఖరునుంచి పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
– మెడికల్ కాలేజీల్లో వీలైనంత త్వరగా తరగతులు నిర్వహించేలా తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలని సీఎం ఆదేశం.
ఈ సమీక్షా సమావేశంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి ఎస్ నవీన్ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఏపీఎంస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్రెడ్డి, ఏపీవీవీపి కమిషనర్ వి వినోద్కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్(డ్రగ్స్) రవిశంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment