*• పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీడియా మాట్లాడుతూ
• నాసిక్ లో పుట్టిన గోదావరి సముద్రంలో కలిసే వరకు పూర్తి పర్యవేక్షణ ఉంది. ప్రవాహాలపై రికార్డులు ఉన్నాయి
.
• ఎన్నో ఏళ్లుగా ఈ రికార్డుల ఆధారంగా నదీ నిర్వహణ
• పైనుంచి వచ్చే వరద, ఇక్కడ పడే వర్షం లెక్కించి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది.
• ఎపి ప్రభుత్వం సిడబ్ల్యుసి ఇచ్చే హెచ్చరికలు కూడా ఫాలో అవ్వలేదు
• అనుకోకుండా ఫ్లడ్ రాలేదు...ముందుగా అన్ని సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నాయి.
• కనీసం ఇప్పటికీ మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి అయోధ్య లంకలో ఉంది.
• దున్నపోతు పాలన కారణంగానే ఈ అవస్థలు
• నాయకుడు అనే వాడు లీడ్ చెయ్యాలి...కానీ ఎపి సిఎం కనీసం స్పందించలేదు.
• సిఎం గాల్లో తిరిగాడు...అది కూడా ఈ రూట్ లో పోతూ వరదను గాల్లోనుంచి చూశాడు.
• సిఎం గాల్లో తిరుగుతూ...ప్రజలను బుదరలో ముంచాడు.
• వరదలకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సర్వసన్నద్దంగా ఉండాలి. కానీ అదీ జరగలేదు.
• 25 కేజీల బియ్యం ఇస్తాను అన్నారు...ఎంత మందికి ఇచ్చారు.
• మత్స్య కారులకు ప్రభుత్వ చర్యల కారణంగా ఇబ్బందులు పెరిగాయి.
• మత్స్య కారులు నదుల్లో ఇసుక తెచ్చుకునే అవకాశం లేకుండా చేశారు.
• ముంపు గ్రామాల్లో ప్రజలు అడవుల్లో తల దాచుకునే పరిస్థితి వచ్చింది.
• హెలికాఫ్టర్ లతో ఆహారం అందించవచ్చు. కానీ ఆ ప్రయత్నం చెయ్యలేదు
• టిడిపి హయాంలో పొలాల్లో ఇసుక మేటలు వేస్తే కూడా తొలగింపుకు సాయం చేశాం.
• రాష్ట్రం ఏమీ సాయం చెయ్యకుండా కేంద్రానికి ఎలా ప్రతిపాదనలు పెడుతుంది.
• అంచనాలు రూపొందించి...తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంలో ప్రభుత్వం విఫలం
• పకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రణాళిక ప్రకారం పని చేస్తే కష్టాలు, నష్టాలు తగ్గుతాయి.
• ప్రతి బాధిత కుటుంబానికి 10 వేలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు.
• తెలంగాణలో 10 వేల సాయం ఇచ్చి....పక్కన ఉన్న విలీన గ్రామాల్లో 2 వేలు ఇస్తే ఏంటి అర్థం.
• విలీన గ్రామాల ప్రజలు అక్కడ పడి ఉండాలి అనుకుంటున్నారా
• రాష్ట్రంలో ముంపు బారిన పడిన ప్రతి కుటుంబానికి 10 వేల ఆర్థిక సాయం చెయ్యాలి
• ఇల్లు పూర్తిగా దెబ్బతింటే 50 వేల ఆర్థిక సాయం..పాక్షికంగా దెబ్బతింటే 10 వేలు ఇవ్వాలి
• వరికి హెక్టార్ కు 25 వేలు, ఆక్వాకు 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి.
• వరద లో చనిపోయిన వారికి 10 లక్షలు ఇస్తాం అన్నారు...వారికి 10 లక్షలు ఇవ్వండి
• చనిపోయిన ఆవు లేదా గేదెకు 40 వేలు ఇవ్వాలి.
• ఆయోధ్య లంకలో బ్రిడ్జి నిర్మాణం చెయ్యాలి....అప్పన పల్లి, పెదపట్నంలో కాజ్ వేల నిర్మాణం చేపట్టాలి.
• ఎంత చెత్త ప్రభుత్వం అంటే స్లూయిస్ ల నిర్వహణ కూడా చేపట్టలేదు
• కరకట్టలు దెబ్బతింటే...ఆయా గ్రామాల ప్రజలే కరకట్టలు పటిష్టపరుచుకున్నారు.
• కరకట్ట ప్రాంతంలో ఇసుక బస్తాలు కూడా అందివ్వలేదు.
• చివరికి బోట్ లలో ప్రజలను దాటించిన యజమానులకు కూడా డబ్బులు ఇవ్వలేదు.
• ప్రభుత్వం అంటే విశ్వసనీయత అనేది లేకుండా చేశారు.
• రైతులు మద్దతు ధరలేక వ్యవసాయం మానేస్తున్నారు.
• కొనుగోలు చేసిన ధాన్యానికి కనీసం డబ్బులు ఇవ్వ లేదు.
• జగన్ తండ్రి చనిపోతే 5 ఏళ్లు ఓదార్పు యాత్ర చేశారు....ఓట్ల కోసం పాదయాత్ర చేశారు.
• వరద బాధితులను మాత్రం గాల్లో వదిలేశారు.
• ఎపిలో పరిస్థితులు శ్రీలంక కంటే దారుణంగా ఉన్నాయి.
• శ్రీలంక ప్రభుత్వ అప్పుల కారణంగా ఒక్కో వ్యక్తిపై లక్ష అప్పు.....ఎపిలో ఒక్కొ వ్యక్తిపై 1.70 లక్షలు
• పన్నులతో బాదుతున్నారు....అప్పులకు అప్పులు చేస్తున్నారు.
• ఎపిలో ప్రజలు సహనంతో ఉన్నారు కాబట్టి.....ఇంకా తిరుగుబాటు చెయ్యలేదు
• అయోధ్య లంకలో సమస్యలు చెప్పవద్దని వాలంటీర్లను బెదిరించారు.
• ఈ ప్రభుత్వం వల్ల పోలవరం ప్రాజెక్టు కూడా బలి అయిపోయింది.
• 72 శాతం పని పూర్తి అయిన ప్రాజెక్టును నాశనం చేశారు.
• జూన్ 2020 కి నీళ్లు ఇవ్వాల్సిన ప్రాజెక్టును నట్టేట ముంచేశారు.
• 7 నెలల పాటు ప్రాజెక్టు వద్ద కాంట్రాక్టు సంస్థ లేదు...అధికారులు లేరు
• కాంట్రాక్టర్ ను మార్చవద్దని పిపిఎ స్పష్టంగా చెప్పింది. కేంద్రం హెచ్చరించింది.
• రాష్ట్ర ప్రభుత్వం వల్లనే పోలవరం పూర్తి కావడం లేదని కేంద్రం చెప్పింది.
• లోయర్ కాఫర్ డ్యాం ద్వారా రివర్స్ లో గోదావరి నీరు వచ్చి రెండు కాఫర్ డ్యాంల మధ్యలో చేరింది.
• ఆ నీళ్లు ఎలా తొలగిస్తారు...ఎలా పనులు మొదలు పెడతారు.
• ముంపు ప్రాంతాల్లో ఆర్ అండ్ ఆర్ కింద 10 లక్షలు ఇస్తాను అన్నారు...జగన్ ఇచ్చారా.
• ఒక్క ఇల్లు ముంపు బాధితులకోసం కట్టారా.....
• జగన్ పోలవరం ముంపు గ్రామాల ప్రజల కోసం ఇళ్లు కట్టి ఉంటే వారికి కష్టాలు తప్పేవి.
• ప్రభుత్వం సమస్యలపై సమాధానం చెప్పాలి...ఎదురుదాడి కరెక్ట్ కాదు.
• పోలవరం ముంపు బాధితులను ఏం చేస్తారో జగన్ చెప్పాలి.
• భూ సేకరణ లోను పెద్ద స్కాం చేశారు.
• దేశంలో ఎక్కడా లేని విధంగా టిడ్కో ఇళ్లు కడితే....వాటినీ కేటాయించలేదు.
• ప్రభుత్వం చెప్పిన విధంగా వరద బాధితులకు పరిహారం ఇవ్వకపోతే మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తాం.
addComments
Post a Comment