అల్లూరి స్ఫూర్తితో యువ‌త‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించే దిశ‌గా కృషి : జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి



ఘ‌నంగా అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి వేడుక‌లు


మ‌న్యం వీరునికి నివాళుల‌ర్పించిన ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి


ప్ర‌తి ఒక్క ఆంధ్రుడు గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి అల్లూరి : ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భద్ర‌స్వామి


అల్లూరి స్ఫూర్తితో యువ‌త‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించే దిశ‌గా కృషి : జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి



విజ‌య‌న‌గ‌రం, జూలై 04 (ప్రజా అమరావతి): మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి వేడుక‌ల సంద‌ర్భంగా ఆయ‌న‌కు జిల్లా కేంద్రంలో ఏర్పాటైన కార్య‌క్ర‌మంలో ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, ప‌లు సంఘాల ప్ర‌తినిధులు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. స్థానిక దాస‌న్న‌పేట రింగురోడ్డులోని అల్లూరి విగ్ర‌హం వ‌ద్ద సోమ‌వారం ఏర్పాటైన కార్య‌క్ర‌మంలో స్థానిక శాస‌న‌స‌భ్యులు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, జిల్లా కలెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి, మేయ‌ర్ వి.విజ‌య‌ల‌క్ష్మి, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డిప్యూటీ మేయ‌ర్‌లు కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, రేవ‌తీదేవి, జిల్లా అధికారులు, అల్లూరి సేవా స‌మితి ప్ర‌తినిధులు, ప‌లు సంఘాల నాయ‌కులు ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. తొలుత అల్లూరి చిత్ర‌ప‌టం వ‌ద్ద ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌, జిల్లా క‌లెక్ట‌ర్ త‌దిత‌రులు జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. అనంత‌రం అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హానికి పూల‌మాలలు వేసి నివాళుల‌ర్పించారు.


💠ప్ర‌తి ఆంధ్రుడూ గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి అల్లూరి : ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి

ప్ర‌తి ఒక్క ఆంధ్రుడూ గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి అల్లూరి సీతారామ‌రాజు అని స్థానిక శాస‌న‌స‌భ్యులు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. దేశానికి బ్రిటిష్ పాల‌కుల నుంచి విముక్తి క‌ల్పించేందుకు జ‌రిగిన పోరాటంలో ఎంద‌రో స‌మ‌ర‌యోధులు త‌మ ఆస్తుల‌ను, ప్రాణాల‌ను జీవితాల‌ను త్యాగం చేశార‌ని, వారిలో అల్లూరి ఒక‌ర‌ని ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల పేర్కొన్నారు. అతి చిన్న‌వ‌య‌సులోనే పోరాట‌బాట ప‌ట్టి గిరిజ‌నుల‌ను బ్రిటిష్ వారికి వ్య‌తిరేకంగా స‌మాయ‌త్తంచేసి బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన వ్య‌క్తిగా అల్లూరి దేశ‌చ‌రిత్ర‌లో నిలిచివుంటార‌ని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ, నెహ్రూ, ప‌టేల్ వంటి వారు శాంతియుత పోరాటం చేస్తే, తుపాకీకి ఎదురొడ్డి నిల‌బ‌డి వీరోచిత పోరాటం చేసి త‌న ప్రాణాల‌నే అర్పించిన వ్య‌క్తి అల్లూరి సీతారామ‌రాజు అని పేర్కొంటూ భావిత‌రాలు అల్లూరి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని స‌మాజ‌హితం కోరి ప‌నిచేయాల‌న్నారు. అల్లూరి మ‌న‌తో స‌జీవంగా లేక‌పోయినా ఆయ‌న ఆశ‌యాలు, పోరాట‌స్ఫూర్తి ఎప్ప‌టికీ నిలిచి వుంటాయ‌న్నారు. అల్లూరి సేవాస‌మితి కోరిన మీద‌ట మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, జిల్లా క‌లెక్ట‌ర్‌ల స‌హ‌కారంతో న‌గ‌రంలో అల్లూరి విగ్ర‌హం ఏర్పాటు చేయ‌గ‌లిగినట్టు చెప్పారు. రానున్న రోజుల్లోనూ సేవాస‌మితి చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు పూర్తిస‌హ‌కారం అందిస్తామ‌న్నారు.


💠అల్లూరి స్ఫూర్తితో యువ‌త‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించే దిశ‌గా కృషి : జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి


మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు స్ఫూర్తితో జిల్లా యువ‌త‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించే దిశ‌గా కృషిచేస్తున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి చెప్పారు. ఇంట‌ర్ ఉత్తీర్ణులైన యువ‌తీ యువ‌కుల‌ను గ్రూపులుగా ఏర్ప‌ర‌చి వారిని మొబైల్‌, సోష‌ల్ మీడియా అనే వ్య‌స‌నానికి బానిస‌లు కాకుండా వారి దృష్టి మ‌ర‌ల్చి క్రీడ‌ల్లో పాల్గొనేలా ప్రోత్స‌హించ‌డం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ పెంపొందించేలా త‌గిన శిక్ష‌ణ‌లు ఇచ్చే అంశంపై దృష్టి సారించామ‌న్నారు. అల్లూరి స్ఫూర్తితో యువ‌త స‌మాజంలోని సామాజిక అన్యాయాలు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై పోరాడాల‌న్నారు. 25 ఏళ్ల వ‌య‌సులో త‌న‌కు శ‌త్రువు ఎవ‌రు, ఎంత‌టి వాడ‌నే భీతి లేకుండా త‌న ఆశ‌య సాధ‌న‌కోసం ఎంతో ధైర్యంగా పోరాడిన వ్య‌క్తి అల్లూరి అని పేర్కొంటూ, యువ‌త ఆయ‌న‌ను స్ఫూర్తిగా తీసుకొని నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించుకోవాల‌న్నారు. మ‌న రాష్ట్రంలో గ‌తంలో ఎక్క‌డ ఏక‌పాత్రాభిన‌యం పోటీలు జ‌రిగినా యువ‌త అల్లూరి వేష‌ధార‌ణ‌లో క‌నిపించేందుకు ఉత్సాహ ప‌డుతుంటార‌ని, ఆయ‌న ప్ర‌జ‌ల గుండెల్లో ఎన్న‌టికీ నిలిచి వుంటార‌ని పేర్కొన్నారు. 125 ఏళ్ల  త‌ర్వాత కూడా ఆయ‌నను స్మ‌రించుకుంటున్నామని పేర్కొంటూ ఆయ‌న ఎప్ప‌టికీ చిర‌స్మ‌ర‌ణీయుల‌ని చెప్పారు.


💠ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, న‌గ‌ర మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌లు కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, రేవ‌తీదేవి, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, లోక్‌స‌త్తా అధ్య‌క్షుడు భీశెట్టి బాబ్జీ, అల్లూరి సేవాస‌మితి అధ్య‌క్షులు కె.ఏ.పి.రాజు(శివ‌), ప్ర‌తినిధులు సూర్య‌నారాయ‌ణ రాజు, వ‌ర్మ‌, రామ‌రాజు, కె.ఆర్‌.కె.రాజు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌.శ్రీ‌రాములు నాయుడు, సెట్విజ్ సి.ఇ.ఓ. విజ‌య్ కుమార్‌, ప‌ర్యాట‌క అధికారి ల‌క్ష్మీనారాయ‌ణ‌, సిపిఓ పి.బాలాజీ, నెహ్రూ యువ‌కేంద్రం జిల్లా యువ‌జ‌న అధికారి విక్ర‌మాదిత్య‌, ఎస్‌.ఎస్‌.ఎస్‌.ఎస్‌.రాజు, జ‌న‌సేన నాయ‌కులు ఆదాడ మోహ‌న‌రావు, డి.ఆర్‌.డి.ఏ. ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ క‌ళ్యాణ చక్ర‌వ‌ర్తి, మెప్మా పి.డి. సుధాక‌ర్‌, జిల్లా వ్య‌వ‌సాయ అధికారి వి.టి.రామారావు, ప‌శుసంవ‌ర్ధ‌క అధికారి బి.వి.ర‌మ‌ణ‌, హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్ర‌తినిధి కొండ‌బాబు, ప‌ట్ట‌ణ పేద‌ల సంక్షేమ స‌మితి ప్ర‌తినిధి శ్రీనివాస్‌, బి.సి.కార్పొరేష‌న్ ఇ.డి. పెంటోజీరావు, వార్డు కార్పొరేట‌ర్ గాదం ముర‌ళి త‌దిత‌రులు పాల్గొన్నారు.



Comments
Popular posts
2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం.
Image
ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు.
Image
రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి.
Image
భవిష్యత్ గ్యారెంటీపై టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image