వరదలు వచ్చినప్పుడు సిఎంకు ప్యాలెస్ లో ఏం పని

 అల్లూరి జిల్లా (ప్రజా అమరావతి);


*రెండు రోజుల పాటు విలీన మండలాల్లోని గోదావరి ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన టిడిపి అధినేత  నారా చంద్రబాబు నాయుడు*


*వేలేరుపాడు, కుక్కునూరు, ఎటపాక, కూనవరం, విఆర్ పురం మండలాల్లో పలు గ్రామాల్లో బాధితులకు చంద్రబాబు పరామర్శ*


కూలిన ఇళ్లను చూసి చలించిపోయిన టిడిపి అధినేత...తమ బాధలు చెప్పుకున్న ముంపు గ్రామాల ప్రజలు


అంతకు ముందు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న టిడిపి అధినేత.

భద్రాచలం కరకట్టను సందర్శించిన చంద్రబాబు నాయుడు.


*నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం*


రాష్ట్రంలో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పాలిస్తోంది.

రాష్ట్రంలో పలానా ప్రదేశంలో పిడుగు పడుతుంది అనే హెచ్చరికలు చేసే వ్యవస్థ కూడా ఎపిలో తీసుకువచ్చాం.

అయితే ఇప్పుడు గోదావరి వరద వస్తే హెచ్చరించే వ్యవస్థ కూడా లేదు.

తోటపల్లిలో పిడుగు పాటుకు గురై చనిపోయిన శ్రీదేవి కుటుంబానికి అండగా ఉంటాం.

ఇంత వరద కష్టం వస్తే....ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు ఎలా సరిపోతుంది.

వరదలు వస్తే సిఎం జగన్ గాల్లో తిరిగాడు...10 కిలోమీటర్లకు కూడా జగన్ హెలికాఫ్టర్ ఎక్కాడు.

ప్రజల కోసం కష్టమైనా పలకరించాలని బాధ్యతతో ఇంత దూరం వచ్చాను.

వరదలు వచ్చినప్పుడు సిఎంకు ప్యాలెస్ లో ఏం పని


25 మంది ఎంపిలు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాను అన్నాడు...ఇప్పుడు మెడలు దించాడు

పోలవరం కట్టలేను...పరిహారం ఇవ్వలేను అని జగన్ తేల్చేశాడు.

జగన్ ఏం చేశాడని 175 కు 175 సీట్లు ఇస్తారు.

జగన్ ప్రభుత్వానికి జనం నెగటివ్ మార్కులు వేస్తారు.

వైసిపి ఎంపిలు రాజీనామాలు చేస్తే పోలవరం పరిహారం వస్తుంది.

ఎంపిల రాజీనామాలు చెయ్యడానికి జగన్ సిద్దమేనా

వెళ్ళడానికి వీలు లేని పాడేరులో జిల్లా కేంద్రం పెట్టారు.

పోలవరం ముంపు ప్రాంతాల వారు పాడేరు ఎలా వెళతారు.

జిల్లా కేంద్రం కంటే అమరావతి, హైదరాబాద్ ఈ ప్రాంతం వాళ్లకు దగ్గర

పోలవరం కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చెయ్యాలి

పోలవరం కేంద్రంగా ముంపు మండలాలతో జిల్లా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలు జీవితాల్లో వెలుగు తీసుకువస్తా.

ప్రజలు ట్రాక్ రికార్డు చూసి నేతల్ని ఎన్నుకోవాలి

దొంగలకి అధికారం ఇస్తే ఏమౌతుందో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు

డ్రైవింగ్ రానివాడికి రాష్ట్రాన్ని అప్పగించటంతో ప్రజా జీవితం తలకిందులైంది

పోలవరం ముంపు బాధితులకు ఆర్ అండ్ ఆర్ కింద జగన్ ఇస్తాను అని చెప్పిన రూ.10లక్షలు ఎందుకు ఇవ్వలేదు.

ఎకరానికి అదనంగా 5 లక్షలు ఇస్తాను అన్నారు...ఇచ్చారా?

జగన్ కు ఉన్నది ఒకటే లక్ష్యం....తన కేసుల నుంచి బయట పడాలి.

వరద బాధితులకు 4ఉల్లిపాయలు, 4టమోటాలిచ్చి అన్ని సమస్యలు తీర్చేశానని జగన్ రెడ్డి చెప్తున్నారు.

ఇంట్లో ఇద్దరున్నా, అయిదుగురు ఉన్నా ఒకే తరహా సాయం అందించటం ఎక్కడి న్యాయం

వరద ప్రాంతాల్లో సీఎం ప్రజలపై ప్రేమతో రాలేదు, మొక్కుబడిగా వచ్చి వెళ్ళాడు

గోదావరి వరదతో ఇళ్లలో ఫ్యాన్ కి 2అంగుళాల బురద పట్టి పనిచేయకుండా పోయాయి. ఆ స్థాయి వరద వచ్చింది

వైసిపి ఫ్యాన్ ఆపితే కానీ ప్రజల కష్టాలు తీరవు.

గాలికొచ్చి గాలికి కొట్టుకుపోయే పార్టీ వైకాపా

పోలవరం పరిహారంపై అసత్యాలు చెప్పిన ఫేక్ ఫెలో జగన్ రెడ్డి

టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం.

అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతుల గుట్ట గ్రామంలో వరద ముంపు బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు

3వారాల నుంచి విద్యుత్ సరఫరా లేక అంధకారంలోనే ఉంటున్నామని బాధితుల ఆవేదన

ఈ నెల 12నుంచి ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నామని విలపించిన బాధితులు

ప్రభుత్వం సరిగ్గా ఆహారం అందించకపోగా నిత్యావసరాలు అరకొరగా అందించిందని చంద్రబాబు వద్ద బాధితుల ఆవేదన

ఒక్కో ఇల్లు శుభ్రం చేసుకునేందుకే రూ.12వేలు ఖర్చవుతోందని వాపోయిన బాధితులు

వరద పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో సగం చచ్చి బతికామని విలపించిన బాధితులు

చంద్రబాబు, తెలుగుదేశం అధినేత:-

వరద బాధితుల్ని కనీసం మనుషుల్లా కూడా ఈ ప్రభుత్వం చూడలేదు

ముఖ్యమంత్రి కి మనసనేది ఉంటే వరద బాధితుల కష్టాలు కళ్ళతో చూడాలి

తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వని అసమర్ధ ప్రభుత్వమిది

పశువులకు గడ్డి కూడా పెట్టించలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

పశువులకు నోరుంటే జగన్మోహన్ రెడ్డిని కుమ్మి వదులుతాయి

తెలుగుదేశం నేతలు సొంత డబ్బులతో  పశువుల దాణా పంపి వాటి ప్రాణాలు కాపాడుతున్నారు.

వేలేరుపాడు మండలం రేఖపల్లిలో టిడిపి అధినేత పర్యటన, ప్రసంగం:-

వరదల సమయంలో ఇంత దారుణంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని చూడలేదు

వాలంటీర్లు, సచివాలయాలు, సిఎం పనిచెయ్యలేదు.

నాలుగు బంగాళదుంపలు, నాలుగు టమాటాలు ఇచ్చి ఇదే ప్రభుత్వ సాయం అంటున్నారు

పోలవరం కట్టలేను....ఆర్ అండ్ ఆర్ ఇవ్వలేను అని సిఎం చెప్పేశాడు

జగన్ ముద్దులకు సమస్యలు పరిష్కారం కావు

ప్రభుత్వంపై ప్రజల్లో కోపం, అసంతృప్తి ఉంది.

వరదల్లో బాగా పని చేసిన కొందరు పోలీసులను ఈ సందర్భంగా అభినందిస్తున్నా

పోలవరం పరిహారం కోసం కేంద్రాన్ని అడుగుతూనే ఉంటా అని జగన్ దీర్ఘాలు తీస్తున్నాడు

25 మంది ఎంపిలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతా అని చెప్పిన జగన్ తన కేసుల కోసం అన్నీ తాకట్టు పెట్టారు.

ముంపు ప్రాంతాల వారి కోసం పోలవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా చేస్తాను

పోలవరం కోసం భూములు త్యాగం చేసిన ప్రజలు పోలవరం జిల్లాలో ఉంటారు

బటన్ నొక్కుతున్నాను అంటున్న సిఎం...పోలవరం ముంపు ప్రజల కోసం బటన్ నొక్కాలి.

పరిహారం కోసం ప్రజలు సిద్దంగా ఉంటే...నేను నాయకత్వం వహిస్తా

పోలవరం పూర్తి చేసే బాధ్యతనే కాదు....పరిహారం బాధ్యత కూడా టిడిపి తీసుకుంటుంది.

Comments