థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలి:



అమరావతి (ప్రజా అమరావతి);

*–ఎనర్జీపై క్యాంప్‌ కార్యాలయంలో  ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*

*–రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంపై పూర్తిస్థాయి సమీక్ష చేసిన సీఎం.* 

*–గడిచిన వేసవికాలంలో డిమాండ్, సప్లైపై గణాంకాలు వివరించిన అధికారులు.* 

*–దేశవ్యాప్తంగా విద్యుత్‌కొరత ఉన్న రోజుల్లో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారీగా విద్యుత్‌ కొనుగోలు చేసినట్టుగా తెలిపిన అధికారులు.* *

*–ఈ ఏడాది మార్చిలో 1268.7 మిలియన్‌ యూనిట్లకోసం రూ. 1123.7 కోట్లు ఖర్చు.*

*–ఏప్రిల్‌ నెలలో 1047.8 మిలియన్‌ యూనిట్లకోసం రూ. 1022.4 కోట్లు ఖర్చు.* 

*–మే నెలలో 739.72 మిలియన్‌ యూనిట్లకోసం రూ.832.92కోట్లు ఖర్చు.* 

*–జూన్‌నెలలో 936.22 మిలియన్‌ యూనిట్లకోసం రూ. 745.75 కోట్లు ఖర్చు.* 

*–జులై 25 వరకూ 180.96 మిలియన్‌ యూనిట్ల కోసం రూ.125.95 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.*


– కృష్ణపట్నం విద్యుత్‌ ప్లాంట్‌ యూనిట్‌–3 నుంచి సెప్టెంబరు–2022 నుంచి విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందన్న అధికారులు

– విజయవాడ ధర్మల్‌ ప్లాంట్‌ ఐదవ స్టేజ్‌ ఫిబ్రవరి –2023 నుంచి అందుబాటులోకి వస్తుందన్న అధికారులు.

– ఈ రెండు యూనిట్ల ద్వారా అదనంగా 1600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌  ఈ ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందన్న అధికారులు.


 

*–ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కొరత, ధర్మల్‌కేంద్రాలపై ప్రభావం తదితర అంశాలపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి.* 

– ఏటా విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నా, దానికి సరిపడా బొగ్గు.. సరఫరా కేంద్రం నుంచి ఉండటం లేదని వివరించిన అధికారులు.

– ప్రతి ఏటా కూడా ఈ గ్యాప్‌ పెరుగుతోందని తెలిపిన అధికారులు.

– 2019–20లో 26.85 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు సరఫరాకు లింకేజి చేసుకుంటే..., 20.84 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు వచ్చిందని, అంటే.. 77.62శాతమే వచ్చిందన్న అధికారులు.

– 2020–21లో 25.38 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకోసం లింకేజి చేసుకుంటే 10.51 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు మాత్రమే వచ్చిందని, 31.14 శాతం మాత్రమే సరఫరా చేశారని తెలిపిన అధికారులు.

– 2021–22లో 25.38 మిలియన్‌ మెట్రిక్‌టన్నులు కావాలని అడిగితే 18.12 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు మాత్రమే సప్లై అయ్యిందని, 71.40శాతం మాత్రమే బొగ్గు వచ్చిందని సీఎంకు తెలిపిన అధికారులు.


*సమీక్షలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశాలు:*


– థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలి:


– దీనికోసం సరైన ప్రణాళికలు రూపొందించండి:

– విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి:

– దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయవచ్చు. 

– డిమాండ్‌ అధికంగా ఉన్న రోజుల్లో కూడా పరిశ్రమలకు ఇబ్బందిలేకుండా విద్యుత్‌ సరఫరాపై సరైన ప్రణాళికను అనుసరించండి:

– కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సప్లై జరిగేలా చూసుకోవాలి:


– ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి:

– కృష్ణపట్నం పోర్టు రేవు దగ్గరే విద్యుత్‌ ప్లాంట్‌ ఉంది కాబట్టి, ఓడలద్వారా తెప్పించుకునే బొగ్గు ద్వారా అక్కడ పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి జరిగేలా చూడండి:

– దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి, ఉత్పత్తి ఖర్చు మిగతా వాటితో పోలిస్తే తగ్గుతుంది:

– సింగరేణి నుంచి కూడా అవసరమైన బొగ్గు వచ్చేలా అక్కడి యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలి:

– కోల్‌స్వాపింగ్‌ లాంటి వినూత్న ఆలోచనలు కూడా చేయాలి:


– పోలవరం విద్యుత్‌ కేంద్ర ప్రాజెక్ట్‌ పనులపైనా సమీక్షించిన సీఎం.

పనుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు.

– దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల నిర్మాణాన్ని కూడా 2024 ఏప్రిల్‌నాటికి పూర్తిచేసేదిశగా అడుగులు ముందుకేస్తున్నామన్న అధికారులు.

– ఎగువ సీలేరులో 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 9 యూనిట్ల పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష.

– డిసెంబరులోగా టెండర్లు ఖరారు చేయాలని సీఎం ఆదేశం.


– వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ఇళ్లకూ కరెంటు సరఫరా చేశామన్న అధికారులు. నీళ్లు పూర్తిగా తగ్గాక వ్యవసాయ పంపులకు కరెంటు ఇస్తామన్న అధికారులు.

– జగనన్న కాలనీల్లో పనులను వివరించిన అధికారులు. కాలనీల్లో ఇంటింటికీ కరెంటు పనులపై తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్న సీఎం.


*వ్యవసాయ మోటార్లుకు మీటర్లు– ప్రయోజనాలు*

– వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటో  చెప్పాలి:

– దీనిపై రైతులకు లేఖలు రాయండి:

– రైతుపై ఒక్కపైసాకూడా భారంపడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్నికూడా వారికి వివరించండి:

– శ్రీకాకుళంలో పైలట్‌ప్రాజెక్ట్‌ ఎలా విజయవంతం అయ్యిందో వివరించండి. రైతులకు జరిగిన మేలు కూడా వివరించండి:

– 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అక్కడ ఆదా అయిన విషయాన్ని రైతులకు వివరించాలి:

– మోటార్లకు మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవు, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుంది, నాణ్యంగా విద్యుత్‌ సరఫరా ఉంటుందనే విషయాన్ని వారికి వివరించాలి:

– వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేయాలని సీఎం ఆదేశం.

– ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైనా వెంటనే రీప్లేస్‌ చేయాలని సీఎం ఆదేశం.


 ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, అటవీ పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, ట్రాన్స్‌కో సీఎండీ బి శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments