శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి):
ఆషాడ మాసం సంధర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆలయ ఇంజినీరింగ్ విభాగపు సిబ్బంది, విజయవాడకు చెందిన కె.వరలక్ష్మి గారి బృందం 200 మంది, పి.దుర్గ గారి బృందం 78 మంది, ఉప్పలపాడు నుండి ఆంజనేయులు గారి బృందం 40 మంది, ఇబ్రాహీంపట్నం నుండి రాధా మాధవ భక్త సమాజ బృందం, ch జ్యోతి గారి బృందం మరియు వివిధ ప్రాంతాలకు చెందిన పలు బృందముల వారు శ్రీ కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించుటకు విచ్చేసిన సందర్భంగా వారందరికీ ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది.
అనంతరం మహామండపం 6వ అంతస్తు నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహింపజేసి, అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగినది.
addComments
Post a Comment