*ఏపీలో విద్యార్థులకు మరో వరం
*
*జగనన్న విదేశీ విద్యా దీవెనపై ఉత్తర్వులు*
అమరావతి (ప్రజా అమరావతి);
ఏపీలో విద్యార్థులకు వైయస్.జగన్ సర్కార్ మరో వరం
విదేశీ విద్యకోసం వైయస్.జగన్ మరో భారీ పథకం
జగనన్న విదేశీ విద్యాదీవెనపై ప్రభుత్వం ఉత్తర్వులు
పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు
ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ వర్తింపు
క్యూఎస్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును భరించనున్న ప్రభుత్వం
మొదటి 100 ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్
100పైబడి 200 ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు.
నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్మెంట్
ల్యాండింగ్ పర్మిట్ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లింపు
ఫస్ట్సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు
రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపు
నాలుగో సెమిస్టర్ లేదా ఫైనల్ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు
పీహెచ్డీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్ వారీగా కోర్సు పూర్తయ్యేంతవరకూఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు
ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తింపు
టాప్ 200 యూనివర్శిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అందరికీ సంతృప్తకర స్థాయిలో జగనన్న విదేశీ దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్
35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా గుర్తింపు
ఏపీలో స్థానికుడై ఉండాలి, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు
ప్రతి ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీచే ఎంపిక.
*గతానికి, ఇప్పటికీ తేడా:*
– 2016 –17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి రూ.318 కోట్లను బకాయిలుగా పెట్టిన గత ప్రభుత్వం.
– చంద్రబాబు సర్కారు సమయంలో ఆర్ధికంగా వెనకబడ్డ అగ్రకులాలకు వర్తింప చేయలేదు. ఇప్పుడు వర్తింపజేస్తూ నిర్ణయం.
– గతంలో సంవత్సరాదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారికి వర్తింపు. ఆదాయ పరిమితి పెంచిన వైయస్.జగన్ సర్కారు. ఇప్పుడు రూ.8 లక్షల లోపు ఉన్నవారికీ వర్తింపు.
– ప్రపంచంలోని కొన్నిదేశాలకే వర్తింపు చేసిన గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రపంచంలోని ఎక్కడైనా 200 అత్యుత్తమ యూనివర్శిటీలకు వర్తింపు.
– చంద్రబాబు హయాంలో ఎస్సీలకు రూ. 15 లక్షలు, ఎస్టీలకు రూ. 15 లక్షలు, కాపులకు రూ.10 లక్షలు, బీసీలకు రూ.10 లక్షలు, మైనార్టీలకు రూ.15 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్. ఇప్పుడు టాప్ 100 యూనివర్శిటీల్లో సీటు వస్తే పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు.
- 101 నుంచి 200 లోపు ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజులను చెల్లించనున్న వైయస్.జగన్ సర్కార్.
– గత ప్రభుత్వం హయాంలో 300 మంది ఎస్సీలకు, 100 మంది ఎస్టీలకు, 400 మంది కాపులకు, 1000 మంది బీసీలకు , 500 మంది మైనార్టీలకు పరిమితి విధించిన గత ప్రభుత్వం. ఇప్పుడు టాప్ 200 యూనివర్శిటీల్లో ఎంతమంది సీట్లు సాధించినా వర్తింపు చేస్తూ నిర్ణయించిన వైయస్.జగన్ సర్కారు.
*గత ప్రభుత్వ విదేశీ విద్యా పథకంలో పలు లోపాలు:*
– గత ప్రభుత్వం హయాంలో విదేశీ విద్య అమల్లో పలు లోపాలను గుర్తించిన విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్ మెంట్విభాగం.
– లబ్ధిదారుల ఎంపికలో ఆదాయ పరిమితులు పాటించలేదని నిర్ధారణ.
– ఆధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకుండానే లబ్ధిదారులైన కొందరు విద్యార్థులు తాము చదువుతున్న యూనివర్శిటీని, వెళ్లాల్సిన దేశాన్ని కూడా మార్చుకున్నారని గుర్తింపు.
– ఆధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకుండానే యూనివర్శిటీలను మార్చుకున్న కొందరు విద్యార్థులు.
– గత ప్రభుత్వంలో స్కీం నుంచి డబ్బు పొందాక కోర్సులు పూర్తిచేయకుండానే వెనుదిరిగి వచ్చిన కొందరు విద్యార్థులు.
– ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు అన్న నిబంధనను ఉల్లంఘించి ఒకే కుటుంబంలో ఒకరికి అంతకంటే ఎక్కువమందికి పథకం వర్తింపు.
– ఈ పథకంలో లబ్ధి పొందిన వారి చిరునామాల్లో వెతికితే వారు కనిపించని వైనం.
– అన్నికంటే ముఖ్యంగా 2016 –17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి చెల్లించాల్సిన రూ.318 కోట్లను బకాయిలుగా పెట్టిన గత ప్రభుత్వం.
addComments
Post a Comment