అమరావతి (ప్రజా అమరావతి);
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146 వ జయంతి ఉత్సవాలను ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్.
పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన సీఎం శ్రీ వైఎస్ జగన్, అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి.
సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ళ మల్లిఖార్జునరావు స్వయంగా చిత్రించిన పింగళి వెంకయ్య చిత్రపటాన్ని ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ.కృష్ణమోహన్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మొండితోక అరుణ్కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, సమాచార శాఖ కమిషనర్ తమ్మా విజయ్కుమార్ రెడ్డి, సీఎంవో అధికారులు, పోలీస్ అధికారులు.
addComments
Post a Comment