రానున్న 25 ఏళ్లకు ప్రత్యేకమైన విజన్ తో ప్రభుత్వాలు పని చెయ్యాలన్న టిడిపి అధినేత

 

గుంటూరు (ప్రజా అమరావతి);

*గుంటూరు లోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*

*ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా ప్రజలకు శభాకాంక్షలు తెలిపిన టిడిపి అధినేత*

*రానున్న 25 ఏళ్లకు ప్రత్యేకమైన విజన్ తో ప్రభుత్వాలు పని చెయ్యాలన్న టిడిపి అధినేత


*

* విజన్ 2047, లక్ష్యాలపై 10 సూచనలు చేసిన చంద్రబాబు నాయుడు*

*చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ అధ్యక్షులు*

జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరాలి. ప్రతి ఒక్కరి మదిలో జెండా ఉండాలి.

75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరి, సర్థార్ పటేల్, నేతాజీ వంటి జాతీయ నేతలను స్మరించుకుందాం.

జాతీయ జెండా రూపకర్త పింగలి వెంకయ్యను ప్రత్యేకంగా స్మరించుకోవాలి.

400 ఏళ్ల క్రితం నాగరికతలో భారత దేశం ఎంతో ముందు ఉంది.

అప్పట్లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం ఉంది.

వలస పాలనలో భారత దేశం తరువాత తీవ్రంగా నష్టపోయింది.

ఆకలి బాధలు, కరువు కాటకాలతో దేశం అల్లాడింది.

నెహ్రూ, పివి, వాజ్ పేయి, మోదీ వంటి వారు దేశాన్ని నడిపించారు.

దేశం స్వాతంత్ర్యం రాక ముందు, వచ్చిన తరవాత అనేది చూడాలి...అలాగే సంస్కరణలకు ముందు సంస్కరణ తరువాత అని చూడాలి.

నాడు పివి నరసింహారావు తీసుకున్న సంస్కరణలతో ప్రపంచ దేశాలతో ఇండియా పోటీ పడుతుంది.

ఎన్టీఆర్ పేదల కోసం, బడుగుల కోసం తెలుగు దేశం పార్టీ స్థాపించారు. 

దేశం అంటే ఒక వ్యక్తి కాదు...అందరూ కలిస్తేనే దేశం.

ప్రతి ఒక్కరు నేషన్ ఫస్ట్ అని ఆలోచించాలి. దాని కోసం పాటుపడాలి.

నాడు సమర యోధుల త్యాగాల స్ఫూర్తితో నేడు పని చెయ్యాలి.

హరిత విప్లవం, పాల విప్లవంతో దేశ గమనం మారిపోయింది.

కరవు కాటకాల నుంచి ప్రపంచానికి ఆహారం పెట్టే దేశంగా భారత్ మారింది.

కరోనాకు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చే దేశంగా అవతరించింది.

కరోనా అన్ని రంగాలను కుదిపేసింది....కానీ అప్పుడు కూడా పని చేసింది రైతులు మాత్రమే

దేశంలో వచ్చిన అనేక సంస్కరణలతో టిడిపి భాగస్వామిగా ఉంది.

విజన్ 2020తో నాడే టిడిపి లక్ష్యాలను నిర్థేశించుకుని పని చేసింది.

తెలుగు దేశం ప్రాంతీయ పార్టీ అయినా....జాతీయ పార్టీ గా పనిచేసింది.

నాడు స్వాతంత్ర్యం కోసం సమర యోధులు పోరాడితే...నేడు తెలుగు దేశం  ప్రజల కోసం పనిచేసింది.

టెలీ కమ్యూనికేషన్ సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి, ఓపెన్ స్కై పాలసీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లలో కీలకంగా వ్యవహరించాం. 

నేడు మనం తీసుకునే నిర్ణయాలు భావి తరాలపైనా....ప్రజల అభివృద్ది పైనా ప్రభావం చూపుతాయి.

దేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకుందాం

మేకిన్ ఇండియాలో రక్షణ రంగ వస్తువుల తయారీలో 35 నుంచి 70 శాతానికి వెళ్లాం.

ఇలాంటివి చూసినప్పుడు మనకు గర్వకారణం.

75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా ప్రతి వ్యక్తిలో స్ఫూర్తి రగలించాలి.

రానున్న 25 ఏళ్లకు ఏమి చెయ్యాలి అనేది నేడు ఆలోచించాలి.

ఇప్పటికీ పేదరికం ఉంది...రైతులు ఆత్మహత్యలు ఉన్నాయి...నిరుద్యో సమస్యలు ఉన్నాయి. వీటిపై ఆలోచన చెయ్యాలి.

ప్రపంచంలో మన వాళ్లు గుర్తింపు సాధించినా సమస్యలు కూడా పీడిస్తున్నాయి.

ప్రభుత్వ విధానాల వల్ల ఫలితాలు మారుతూ ఉంటాయి. స్వర్ణ చతుర్భుజి రోడ్ల నిర్మాణంతో అనేక మార్పులు వచ్చాయి.

ప్రతి ఒక్కరు నాకు ఈ దేశం ఏమి ఇచ్చింది అని కాదు....నేను ఏమి ఇచ్చాను అనేది ఆలోచించాలి.

అదే సమరయోధులకు ఇచ్చిన నిజమైన నివాళి అవుతుంది.

రానున్న 25 ఏళ్లకు ప్రభుత్వాలు విజన్ తయారు చేసుకోవాలి. సమస్యలు, సవాళ్లపై ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.

1.విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించాలి. 

2.ఆర్ధిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలి. 

3.బలమైన యువశక్తి ఉన్న దేశం ఇండియా. యువకు అవకాశాలు కల్పించాలి.

4.దేశంలో సంపద సృష్టి జరగాలి...ఆ సంపదను పేద ప్రజలకు పంచాలి.

5.రైతుల కోసం ప్రత్యేకమైన పాలసీలు తీసుకురావాలి. 75 ఏళ్ల తరువాత కూడా రైతు ఆత్మహత్యలు దేశానికి గౌరవం కాదు.

6.విద్య, ఆరోగ్యం అందరికీ చేరువ కావాలి.

7.మహిళా సాధికారత కు ప్రణాళికలు అమలు చెయ్యాలి.

8.దేశంలో నదుల అనుసంధానం ప్రారంభం కావాలి. ఎపిలో గోదావరి కృష్ణ నదుల అనుసంధానం చేశాం. కరవు రహిత దేశం కోసం నదుల అనుసంధానం జరగాలి.

9.అవినీతి లేని పాలనను అందించాలి. టెక్నాలజీ ద్వారా అవినీతిని అంతం చెయ్యాలి.

10.ప్రపంచంలో 25 ఏళ్లలో అగ్రదేశంగా భారత్ అవతరించడానికి ప్రణాళికలు రచించాలి. అన్ని అర్హతలు, వనరులు ఉన్న మన దేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం కావాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఒక సంకల్పంతో, ప్రణాళికతో పని చేసి దీన్ని సుసాధ్యం చెయ్యాలి.

Comments