విజయవాడ (ప్రజా అమరావతి);
ఆకట్టుకునేలా అలంకృత శకటాలను తీర్చిదిద్ది సిద్ధం చేయాల
ని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం ప్రదర్శించే అలంకృత శాకటాలను ఆదివారం రాత్రి కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డి పరిశీలించి తుది సూచనలు చేశారు. వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించే శకటాలు ఆకర్షనీయంగా ఉండాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించి 15 అలంకృత శకటాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అలరించనున్నాయి. శకటాలను సిద్ధం చేసి సోమవారం ఉదయం జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలని కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.
శకటాలను పరిశీలించిన వారిలో కమిషనర్ తో పాటు జాయింట్ డైరెక్టర్లు టి. కస్తూరిబాయ్, కిరణ్ కుమార్ శకటాల ఇన్చార్జులు ఉన్నారు.
addComments
Post a Comment