గోరంట్ల మాధవ్ వ్యవహారం పై విచారణ జరిపి చర్యలు తీసుకోండి..


గోరంట్ల మాధవ్ వ్యవహారం పై విచారణ జరిపి చర్యలు తీసుకోండి..


- ప్రభుత్వానికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచన

- సత్వర విచారణ చేయాలని డీజీపీకి లేఖ


అమరావతి (ప్రజా అమరావతి):

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో  వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గుతేల్చాలన్నారు. ఈమేరకు డీజీపీకి శనివారం లేఖరాసినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


Comments