రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశం.


అమరావతి (ప్రజా అమరావతి);


*వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్ సమీక్ష.*


*ఖరీప్ సీజన్ పై సీఎంకు వివరాలందించిన అధికారులు.*

– రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదు.

– ఆగస్టు 3 నాటికి 16.2 శాతం అధిక వర్షపాతం నమోదు.

– ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 36.82 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం ఉంటుందని అంచనా కాగా, ఇప్పటికే 18.8 లక్షల హెక్టార్లలో పంటలసాగు.


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..* 

– రైతులకు అందుతున్న విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలని సీఎం ఆదేశం. 


– సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపిన అధికారులు. 

– ఆర్బీకేల ద్వారా వీటిని పంపిణీచేస్తున్నామన్న అధికారులు.

– రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశం.


– ఎక్కడ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.


– ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నుంచి నిరంతరం ప్రతి రోజూ సమాచారం తెప్పించుకోవాలన్న సీఎం.  

– విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై నిరంతరం ప్రతి ఆర్బీకే నుంచి అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా తెప్పించుకోవాలన్న సీఎం.


*నూటికి నూరు శాతం ఇ- క్రాప్‌*

– ఇ– క్రాప్‌ వందశాతం పూర్తిచేయాలని సీఎం ఆదేశం.

– సెప్టెంబరు మొదటివారంలోగా ఇ– క్రాపింగ్‌ పూర్తిచేయాలని సీఎం ఆదేశం.

– ఆర్బీకేల్లోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్, రెవిన్యూ అసిస్టెంట్‌లు ఈ ప్రక్రియను పూర్తిచేసేలా చూడాలన్న సీఎం. 

– రోజువారీగా ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలన్న సీఎం. 

– ఇ–క్రాపింగ్‌ చేసిన తర్వాత భౌతిక రశీదు, డిజిటల్‌ రశీదు ఇవ్వాలన్న సీఎం. 

– ఇ– క్రాపింగ్‌ చేసినప్పుడు జియో ట్యాగింగ్‌ కూడా చేస్తున్నామన్న అధికారులు.

వెబ్‌ ల్యాండ్‌తో కూడా అనుసంధానం చేస్తున్నామన్న అధికారులు. 

– వెబ్‌ ల్యాండ్‌లో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే.. వాటిని వెంటనే సరిదిద్దుకుంటూ పోవాలన్న సీఎం. 


– వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంతో భాగస్వామ్యం కానున్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన.

– రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.


– ఆర్బీకేల్లో ప్రతి కియోస్క్‌ పనిచేసేలా చూడాలన్న సీఎం.

వాటికి సవ్యంగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉందా? లేదా? అన్నదానిపై నిరంతరం పరిశీలన చేయాలన్న సీఎం. 

– అవి సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.


– వైయస్సార్‌ యంత్రసేవ కింద రైతులకు మరిన్ని పరికరాలు ఇవ్వాలన్న సీఎం. 

దీనికోసం అన్నిరకాలుగా సిద్ధంకావాలన్న సీఎం. 


*వ్యవసాయరంగంలో డ్రోన్ల వినియోగంపై సమావేశంలో చర్చ.* 

– మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయాలన్న సీఎం.

– డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

– నియోజకవర్గానికి ఒక  ఐటీఐ లేదా ఒక పాలిటెక్నిక్‌ కళాశాలలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలన్న సీఎం. 


సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి,  ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయశాఖ) అంబటి కృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ సి హరికిరణ్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments