తిరుమల
6 ఆగస్టు (ప్రజా అమరావతి);
శ్రీవారి ఆలయ భూమి పూజకు రండి
- మహారాష్ట్ర సి ఎం , డిప్యూటీ
సి ఎం కు టీటీడీ చైర్మన్ ,ఈవో ఆహ్వానం
ముంబై లో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే , ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ లను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , ఈవో శ్రీ
ఎ వి ధర్మారెడ్డి ఆహ్వానించారు .
ఈ మేరకు శనివారం ఉదయం వీరు ముంబైలో సిఎం , డిప్యూటీ
సి ఎం లను కలిశారు . వేద పండితులు శ్రీ షిండే ,శ్రీ ఫడ్నవీస్ కు వేద ఆశీర్వచనం చేశారు . చైర్మన్ ,ఈవో శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు . ఆగస్టు 21వ తేదీ భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు . సి ఎం ,డిప్యూటీ సి ఎం ఇద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పారు .
ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీ కి 10 ఎకరాల భూమి అప్పగించింది . రేమండ్స్ కంపెనీ అధినేత శ్రీ గౌతం సింఘానియా ఈ భూమి లో స్వామి వారి ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే .
addComments
Post a Comment