శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు అనగా ది.07-08-2022 న హైదరాబాద్ కి చెందిన హ్యాపీ మొబైల్స్ సంస్థ వారు మరియు కుటుంబసభ్యులు సుమారు 4 కేజీల 390 గ్రాములు బరువు కలిగిన వెండి గంగాళంను శ్రీఅమ్మవారి నివేదన నిమిత్తం శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు కానుకగా అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు అందజేసినారు.
addComments
Post a Comment