___ ప్రెస్ క్లబ్ పనితీరు పట్ల పలువురు ఆకర్షణ
___ క్లబ్ సభ్యుల పునర్ వ్యవస్థీకరణ
కాకినాడ, ఆగస్టు 11 (ప్రజా అమరావతి): కాకినాడ నగరంలోని కాకినాడ ప్రెస్ క్లబ్ చేస్తున్న సేవలను గుర్తించి త్వరలో క్లబ్లో చేరేందుకు పలువురు జర్నలిస్టు వర్తమానం పంపుతున్నారని వారిని త్వరలోనే సాదరంగా ఆహ్వానించి క్లబ్లో మంచి సముచిత స్థానం కల్పించనున్నట్లు క్లబ్ అధ్యక్ష, కార్యదర్సి, కోశాధికారిలతో పాటు సభ్యులు తెలిపారు. గురువారం కాకినాడ నగరంలోని డ్రైవర్ అసోసియేషన్ భవనంలో ప్రెస్ క్లబ్ కాకినాడ పునర్వ్యవస్థీకరణ కార్యవర్గం ఎంపికైంది. ఈ ఎంపికలో పలువురు జర్నలిస్టులకు వివిధ రకాల బాధ్యతలను అప్పగించారు. క్షేత్రస్థాయిలో పనిచేసి మన్ననల్ని పొందుతున్న వారిని ఇందులో ముఖ్య బాధ్యతలను ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. అలాగే త్వరలో వివిధ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంస్థల నుండి పలువురు జర్నలిస్టులు చేరేందుకు ఆకర్షితులవుతున్నారని వారందరినీ క్లబ్ సమావేశంలో చర్చించి వారికి సముచిత స్థానం ఇస్తామని చెప్పారు. క్లబ్బు తీరుతను సభకు తెలియజేయడం పట్ల పలువురు ప్రశంసించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి స్థానాలను కొనసాగుతూనే మరికొందరుకు సముచిత స్థానాన్ని క్లబ్ సభ్యులు అందరూ కలిసి వారికి కట్టబెట్టారు. క్లబ్ అధ్యక్షుడు ఎంవి శివరామకృష్ణ, కార్యదర్శి జి శోభన్ బాబు, కోశాధికారి కోనేటి శ్రీనివాసులతో పలుమార్లు సభ్యులు చర్చించి ఎంపిక చేశారు.
క్లబ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా సిటీ కేబుల్ బ్యూరో ఇంచార్జ్ పీతల అచ్యుత రామారావు, ఉపాధ్యక్షులుగా ముమ్మిడి లక్ష్మణ్, సుమన్, కే లలితాదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జిహెచ్ ఈశ్వర్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా కనపర్తి రాజు, కార్యనిర్వాక సభ్యులుగా కేఎన్వి హరి, యాళ్ళ సుబ్బారావు, కరుణాకర్, ఖండవల్లి సునీల్ కుమార్, కొండబాబులను అందరు కలిసి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ అన్ని కార్యక్రమాలు తమ వంతు బాధ్యతగా నెరవేస్తావని చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఒక్క జర్నలిస్టుకు చిన్న పెద్దా అనే సంస్థ యొక్క బేధాభి ప్రాయాలు లేకుండా సముచిత సానాన్ని కల్పిస్తామన్నారు. అనంతరం క్లబ్ సభ్యుల హర్షద్వనాల మధ్య కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసి పరిచయం చేశారు.
addComments
Post a Comment