ఎస్సీ గురుకులాల్లో మొదలైన సీబీఎస్ఇ విద్యాబోధన



ఎస్సీ గురుకులాల్లో మొదలైన సీబీఎస్ఇ విద్యాబోధన


టీచర్లకు పూర్తయిన శిక్షణ

పరీక్షల విధానంలో పలుమార్పులు

విద్యాప్రమాణాల పెంపునకు పటిష్టచర్యలు

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి.

అమరావతి, సెప్టెంబర్ 5 (ప్రజా అమరావతి): ఎస్సీ గురుకుల విద్యా సంస్థల్లో ఈ ఏడాది నుంచి సిబీఎస్ఇ సిలబస్ లో విద్యాబోధనను ప్రారంభించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జన వెల్లడించారు. సిబీఎస్ఇ విధానంలో విద్యాబోధన కోసం టీచర్లకు అవసరమైన శిక్షణలు కూడా ఆయన తెలిపారు.

రాష్ట్ర సచివాలయంలో సోమవారం సాయంత్రం బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో విద్యాబోధన మెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యలపై నాగార్జున అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్సీ గురుకులాల్లో 8వ తరగతి నుంచి సీబీఎస్ఇ సిలబస్ ను ప్రారంభించామని చెప్పారు. ఈ కొత్త విధానంలో విద్యార్థులకు పాఠాలను బోధించడానికి గురుకులానికి చెందిన ఉపాధ్యాయులకు అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ ద్వారా శిక్షణను ఇప్పించామని తెలిపారు. గురుకుల విద్యార్థులకు విద్యాబోధన మరింత సరళీకృతం చేయడంలో భాగంగా డిజిటల్ క్లాస్ రూములు, వర్చువల్ క్లాస్ రూముల ద్వారా కూడా విద్యాబోధన చేయడానొకి కూడా ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. పరీక్షల విధానంలో కూడా మార్పులను తీసుకువచ్చామని చెప్పారు. ముఖ్యంగా 9, 10 తరగతుల విద్యార్థులు, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతివారం పరీక్షలను నిర్వహించడానికి చర్యలు చేపట్టామని నాగార్జున తెలిపారు. అలాగే ముందుగా రెండు టెస్ట్ లు నిర్వహించిన తర్వాత క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్ పరీక్షలను నిర్వహించనున్నామని ఈ విధంగా వారాంతపు పరీక్షలు కాకుండా ప్రధానమైన 7 టెస్టులు, పరీక్షలు పెట్టడం ద్వారా విద్యార్థులు వారు విన్న పాఠాలను పూర్తిగా అవగతం చేసుకొని ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉండేలా చర్యలను చేపట్టామని వివరించారు. అలాగే విద్యార్థులలో పాజిటివ్ ధృక్పధం ఏర్పడడానికి అవసరమైన శిక్షణలు ఇచ్చేందుకు టాటా ఇనిస్టిట్యూట్ ఆప్ సోసియల్ సైన్సెస్, ఈశ్వరీయ బ్రహ్మకుమారీ సంస్థలు ముందుకు వచ్చాయని ఈ సంస్థలతో త్వరలోనే ఒప్పందాలు కూడా చేసుకోనున్నామని తెలిపారు. గురుకులాల్లో విద్యాప్రమాణాలు పెంపొందించడానికి తీసుకుంటున్న చర్యలపై జిల్లా సమన్వయకర్తలు (డీసీఓ) లతో ఒక సమావేశం నిర్వహించాలని గురుకులం అధికారులను మంత్రి ఆదేశించారు. డీసీఓల సమావేశం తర్వాత ఆయా జిల్లాల్లో డీసీఓలు ప్రిన్సిపాల్స్ తో సమావేశాలు పెట్టుకోవాలని, ఈ మీటింగ్ తర్వాత ప్రిన్సిపాల్స్ తమ స్టాఫ్ మీటింగ్ లను పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశాల తర్వాత తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి గురుకులాల్లో కొత్త విద్యా విధానాలను ఏ మేరకు అమలు చేస్తున్నారనే విషయం పరిశీలించనున్నామని నాగార్జున తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ గురుకులాల సంస్థ కార్యదర్శి పావన మూర్తి, డిప్యుటీ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ బీవీ మల్లేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.



Comments