ఇష్ట దైవమైన గాయత్రీదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందదాయకమ

 

ఇంద్రకీలాద్రి  (ప్రజా అమరావతి);


శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా  గాయత్రీదేవి అవతారంలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని బుధవారం డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు దర్శించుకున్నారు. 


ఆలయ ఈవో డి. భ్రమరాంబ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు స్వాగతం పలికారు.   అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం,  అమ్మవారి శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.


అనంతరం మీడియా సెంటర్ వద్ద 

డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ తన ఇష్ట దైవమైన గాయత్రీదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందదాయకమ


న్నారు.ప్రజలు   సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం సస్యశామలంగా పాడి  పంటలతో కళకళలాడాలని  అమ్మవారిని కోరుకున్నానన్నారు. 

అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు, దివ్యాంగులకు ముఖ్య అతిధులకు ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చేసిన  ఏర్పాట్లు సంతోషదాయకమని  డిప్యూటీ సీఎం అన్నారు.


          

Comments