తిరుపతి, సెప్టెంబర్17 (ప్రజా అమరావతి): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సతీ సమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) రాజన్న దొర.
ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం సంబంధిత అధికారులు ఆలయం వద్ద స్వాగతం పలికి అమ్మవారి దర్శన అనంతరం తీర్థ ప్రసాదములు అందచేసి అర్చకులు ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికార ఇంఛార్జి అధికారి చెన్నయ్య, ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ రాణి మంద, తిరుచానూరు తాసిల్దారు, గిరిజన నాయకులు అక్కులప్ప తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment