టిడిపి ఇంత బలంగా ఉండడానికి కారణం బిసి వర్గాలు


 అమరావతి (ప్రజా అమరావతి);


*తెలుగు దేశం పార్టీ బిసి రాష్ట్ర విభాగం, సాధికార కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*


*విజయవాడ ఎ కన్వెన్షన్ లో వేలాది మంది తో జరిగిన సభకు హాజరైన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు*


*కమిటీల సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన పార్టీ అధినేత చంద్రబాబు*


*సభలో నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం*


తెలుగు దేశం పార్టీకి వెన్నెముక వెనుక బడిన వర్గాలు

టిడిపి ఇంత బలంగా ఉండడానికి కారణం బిసి వర్గాలు

బిసిలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చింది ఎన్టీఆర్

బిసిల ఘనత తెలుగు దేశం ముందు...తెలుగు దేశం తరువాత అని చూడాల్సి ఉంది.

బిసిలను అంతకుముందు ఓటు బ్యాంకుగా చూశారు....పదవులు కూడా ఇవ్వలేదు.

ఎన్టీఆర్ వచ్చిన తరువాత బిసిలకు రాజ్యాధికారం సాధ్యం అయ్యింది.

తెలుగు దేశం పార్టీ వచ్చిన తరువాత బిసి లనుంచి నాయకత్వాన్ని పెంచాం

అధికారంలో బిసిలను భాగస్వాములను చేశాం...దీంతో బిసి వర్గాలు శక్తివంతమైన వర్గాలు అయ్యారు.

బిసిల నాయకత్వం పెంచడం కోసం స్థానిక సంస్ధల్లో రిజర్వేషన్లు పెట్టారు.

ఎన్టీఆర్ 24 శాతం చేస్తే....నేను దాన్ని 34 శాతానికి పెంచాను. 

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బిసిల రిజర్వేషన్లను పది శాతం తగ్గాయి.

జగన్ కారణంగా 16 వేల మంది బిసి సోదరులు పదవులకు దూరం అయ్యారు.

టిడిపి 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు....వైసిపి ఎందుకు అమలు చెయ్యలేకపోయింది.

కేంద్రంలో ఏకైక క్యాబినెట్ మంత్రి పదవి వస్తే దాన్ని ఎర్రం నాయుడు కు ఇచ్చాం

రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్నత శాఖలు అన్ని బిసిలకు ఇచ్చాం.

అధికారంలో భాగస్వాములు చేశాం.....బలోపేతం చేశాం.

ఎవరెన్ని మాటలు చెప్పినా బిసిలు ఎప్పుడూ టిడిపి తోనే ఉన్నారు.

మూడున్నరేళ్ల జగన్ పాలన తరువాత 90 శాతం బిసిలు మళ్లీ టిడిపి వైపు వచ్చారు.

బిసిలను ఆర్థికంగా పైకి తేవాలని నేను ఆలోచించాను. 

బిసిల్లో 142 వర్గాలు ఉన్నాయి.....వీరి కోసం ప్రత్యేక కార్యక్రమాలు పెట్టాను.

మరుతున్న కాలంతో చేతి వృత్తులు మూలన పడ్డాయి. 

దీంతో కుల వృత్తి లో ఉన్నవారికి ఆదరణ కింద ఆధునిక పరికరాలు ఇచ్చాము.

బిసి లకు సబ్ ప్లాన్ తెచ్చిన ఏకైక ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం

జగన్ ఏర్పాటు చేసిన 54 కార్పొరేషన్ లు ఏం చేస్తున్నాయి.

కార్పొరేషన్ ల ద్వారా ఒక్కరికి అయినా సాయం చేశారా

రాష్ట్రంలో బాదుడే బాదుడుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

బటన్ అవుట్ కంటే బటన్ ఇన్ ఎక్కువ అయ్యింది.

ఎప్పుడో ఒక సారి జగన్ పొట్ట పగిలి అన్ని డబ్బులు బయటకు వస్తాయి.

ఆరోజు మధ్యపాన నిషేధం అన్నారు....

జగన్ ఎట్ట పుట్టాడో తెలీదు గాని.....ఏ లగ్నంలో పుట్టాడో గానీ నోరెత్తితే జగన్ అబద్దాలే

అసెంబ్లీలో అన్ని విషయాల్లో జగన్ అబద్దాలే.

మెడికల్ కాలేజీ కోసం ప్రత్యేకంగా మెడికల్ యూనివర్సిటీ తెచ్చింది ఎన్టీఆర్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి...వైఎస్ఆర్ పేరు పెడతారా

ఎన్టీఆర్ పేరు మార్పు తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బ తీయడమే.

దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ కు ప్రాముఖ్యత ఇచ్చింది నేను.

జగన్ అబద్దం చెపితే కనీసం అతికేటట్లు చెప్పాలి.

నేను అనుకుని ఉంటే కడపకు రాజశేఖర్ రెడ్డి పేరు ఉండేదా.

హర్టికల్చర్ యూనివర్సిటీకి వైఎస్ ఆర్ పేరు ఉండేదా

పేరుమార్పుతో నీచ బుద్ది బయట పడింది....జగన్ హూందా తన పెరగలేదు.

జగన్ చేతగాని దద్దమ్మ కబుర్లు చెపుతూ నన్ను విమర్శిస్తున్నాడు.

కడపలో స్టీల్ ప్లాంట్ కట్టి నీ తండ్రి పేరు పెట్టు కో

కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి నీ తండ్రి పేరు పెట్టుకో

రాష్ట్రంలో తట్ట మట్టివెయ్యలేదు....ఇప్పుడు స్టిక్కర్ సిఎం పేర్లుమారుస్తున్నాడు

24 ఏళ్ల క్రితం పెట్టిన పేరును ఇప్పుడు జగన్ తొలగిస్తాడా

జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, కృష్ణకాంత్ వంటి వారి పేర్లుపెట్టి సంస్థలు నిర్మించాం. 

మళ్లీ అధికారంలోకి వస్తాం....అప్పుడు జగన్ రెడ్డి కథ చెపుతాం.

సిఎం నిర్ణయాన్ని తీవ్రంగా కట్టిస్తున్నా....తప్పని ప్రతి ఇంటికి దీన్ని చేరవేద్దాం.

మళ్లీ ఎన్టీఆర్ పేరు వర్సిటీకి పెట్టే వరకు నిద్రపోయేది లేదు.

ఎన్టీఆర్ హయాంలో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం.

పేద పిల్లల కోసం గురుకుల పాఠశాలలు పెట్టాం.

25 ఇంజనీరింగ్ కాలేజ్ లు ఉంటే వాటిని 250 చేశాం.

విద్య తో నే మార్పు అని విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం

జిల్లా కు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిన ఘనత టిడిపిదే.

వెనుక బడిన వర్గాల కోసం విదేశీ విద్యకు 10 లక్షల సాయం చేశాం.

ఆదరణ పథకం కింద 90 శాతం సబ్సిడీ ఇచ్చాం

ఐటికి ప్రాధాన్యత ఇస్తే నాపై విమర్శలు చేశారు.

ఇప్పుడు ఆ ఐటి తోనే యువత జీవితాల్లో పెనుమార్పులు

విజన్ 2020 గురించి విమర్శలు చేశారు...కానీ ఇప్పుడు అదే నిజం అయ్యింది.

కళ్లుండి చూడలేని కబోదులు ఈ వైసిపి నేతలు

డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇస్తే కూడా విమర్శలు చేశారు...ఇప్పుడు కిరాణా కొట్టులో కూడా డిజిటల్ పేమెంట్స్

అన్ని చోట్లా డిజిటల్ పేమెంట్ ఉంది ...కానీ జగన్ మద్యం షాపులో మాత్రం లేదు.

నేను టెలీకమ్యునికేషన్ డీ రెగ్యులేషన్ పై వాజ్ పేయికి రిపోర్ట్ ఇచ్చినప్పుడు జగన్ చడ్డీలు వేసుకుని తిరుగుతుండేవాడు.

నేను ఇచ్చిన ఐటీ ఉద్యోగం మరిచిపోయి...మద్య షాపు, వాలంటీర్ ఉద్యోగం గురించి ఆలోచిస్తే ఎలా.

రాష్ట్రంలో పరిశ్రమలు పారిపోయాయి..ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు.

రాష్ట్రానికి మంచి అవకాశాలు ఉన్న సమయంలో వైసిపి పాలనతో నష్టం

జగన్ తుగ్లక్ పాలనకు ఇక ఇటు ఎవరూ రారు.

మన పిల్లల భవిష్యత్ కోసం తెలుగు దేశం పార్టీ మళ్లీ రావాలి.

రౌడీలు, దొంగలు, బందిపోట్ల నమోనానే ఈ జగన్ రెడ్డి

ఇలాంటి వారి గుండెల్లో నిద్రపోయే శక్తి టిడిపికి ఉంది.

నాకు కులం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బలహీనవర్గాలే నాకులం.

అమరావతి, పోలవరం అనేది మన కోసం రూపకల్పన చేశాం

తెలుగు దేశాన్ని గెలిపించండి......తిరిగి మీ రుణం తీర్చుకుంటా.

నాకు అత్యంత ప్రీతి పాత్రమైన వర్గం బిసి వర్గం

నన్ను గెలిపించింది...ఎక్కువ ఆదరించింది బిసిలే.

వైసిపి రాష్ట్రానికి చీడపురుగు.

నాకు ఒక్క అవకాశం ఇవ్వండి...తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి.

మా ఊర్లో రోడ్లు లేకపోతే..వాగులు వంకల్లో తిరిగి చదువుకున్నాను.

అలాంటి రోజుల నుంచి మనం ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం.

ఎన్టీఆర్ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే.....నేను ఆత్మవిశ్వాసం గురించి చెప్పాను.

కొల్లు రవీంద్ర పై చాలా బాధ్యత ఉందని కమిటీ నియామకం చెప్పినప్పుడే చెప్పాను.

బిసిలను అందరినీ ఒకే తాటిపైకి తేవాలి. బిసిలకు మనం రుణ పడి ఉన్నాం.

బిసిలలో నాయకత్వం తయారుకావాలి. 142 కులాల నుంచి నాయకత్వం కోసం సాధికార కమిటీలు పెట్టాం.

సాథికార కమిటీల ద్వారా లక్ష మందికి పదవులు ఇస్తాం....

జగన్ ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా నేను సిద్దంగా ఉన్నాం.

సిఎం జగన్ భయపడుతున్నాడు కాబట్టే జగన్ కు అసహనం...అసెంబ్లీలో కూడా అది జగన్లో కనిపించింది.

వైసిపి నాయకులు ఇప్పుడు పిల్లులు అయ్యారు.

జగన్ కు మనస్సాక్షి లేదు...నీతి, నిజాయితీ లేదు. జగన్ ఒక అబద్దాల కోరు.

హైకోర్టుకు వెళ్లే రోడ్డు లో లైట్లు లేవని హైకోర్టు లో కేసు వేయాల్సి వచ్చింది

సిఎం జగన్ ఈ పరిస్థితికి సిగ్గు పడాలి.

అదే సుపరిపాలనకు....వైసిపి విద్వంస పాలన ఉన్న వ్యత్యాసం.

కుప్పంలో 70 మందిపై  కేసులు పెడితే ఏమవుతుంది...చరిత్ర హీనుడిగా జగన్ మిగిలిపోతాడు.

జగన్ నంగి నంగి గా మాట్లాడుతాడు.....కమలహాసన్ ను మించిన నటన జగన్ లో ఉంది.

•నాయీ బ్రాహ్మణులు, రజకులు లకు గ్రూప్ లోన్ లు తీసేసారు.

20 లక్షల మంది మత్యకారులు ఉంటే లక్ష మందికే సాయం

చేనేతల సబ్సిడీ కి కోతలు పెట్టారు.

• బీసీ మాజీ మంత్రుల పై అక్రమ కేసులు పెట్టారు.

బాబాయ్ ను చంపిన నీకు ఏ శిక్ష వెయ్యాలి.

39 మందిని రాజకీయ హత్యలు చేస్తే...26 మంది బీసీలు

•పల్నాడులో హత్యలతో బీసీలను చంపేస్తున్నారు.

•బీసీ లు అంటే అంత అలుసు అయ్యిందా?

Comments