పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించనున్న సీఎం


అమరావతి (ప్రజా అమరావతి);


*ఎల్లుండి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటన*


*పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించనున్న సీఎం, అనంతరం అక్కడే బహిరంగసభలో మాట్లాడతారు, ఆ తర్వాత నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని ప్రారంభించనున్న సీఎం*.


*ఈ నెల 6న జాతికి అంకితం చేయనున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌*


*ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్న సీఎం, 10.40 గంటలకు సంగం చేరుకుంటారు. 11 – 1.10 గంటల మధ్య మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించిన అనంతరం, బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు నెల్లూరు బ్యారేజ్‌ సైట్‌కు చేరుకుంటారు. 1.50 – 2.20 గంటల మధ్య నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. 2.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు*.

Comments