ఇంద్రకీలాద్రి: సెప్టెంబర్ 30 (ప్రజా అమరావతి);
శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన అన్నవరం దేవస్థానం ఇ.ఓ ఎన్.వి మూర్తి.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అమ్మవారికి పట్టు వస్త్రాలను అన్నవరం దేవస్థానం తరఫున అందజేయడం జరుగుచున్నది. ఆనవాయితీని కొనసాగిస్తూ శుక్రవారం ఉదయం అన్నవరం దేవస్థానం ఈవో పట్టు వస్త్రాలను శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి పేరున కనకదుర్గమ్మ దేవస్థానం ఈవో డి.భ్రమరాంబకు పట్టు వస్త్రాలను అందజేయడం జరిగింది.
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సందర్భంలో అన్నవరం దేవస్థానం పిఆర్ఓ కొండలరావు ఇతర సిబ్బంది ఈవో వెంట ఉన్నారు.
addComments
Post a Comment