*_బియ్యం,ఇసుక,మద్యం, గుట్కా మాఫియా,దొంగల ముఠాకు నాయకుడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడని_*
*_టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు ఆరోపించారు_*
_*క్యాపిటల్ వాయిస్ వినుకొండ* శుక్రవారం సాయంత్రం స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జీ.వి మాట్లాడుతూ పేదలకు చేరాల్సిన బియ్యం అక్రమంగా తరలిస్తూ విచ్చలవిడిగా రేషన్ దోపిడీ చేస్తున్నారని అన్నారు._
_మా హయాంలో అక్రమ రేషన్ తరలింపు పై 72 కేసులు నమోదు చేశారని ఎమ్మెల్యే చెప్తున్నారంటే అక్రమ రేషన్ తరలింపులో ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు ఏ స్థాయివో అవగతం అవుతుందన్నారు._
_గోనుగుంట్లవారిపాలెం అక్రమ రేషన్ కేసులో ఉన్న నీ బంధువులను తప్పించి మాఫీ చేసే ప్రయత్నం చేయలేదని ఎమ్మెల్యేని ప్రశ్నించారు._
_ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఓటమి భయం పట్టుకొని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు._
_కల్తీ పాలు అమ్మడం, శాతాలతో రైతులను మోసం చేయడం అంతా సులువు కాదు ఆరోపించడం అని అన్నారు._
_అభివృద్ధి చేస్తుంటే జీ.వి ఆంజనేయులు కేసులు వేయిస్తున్నారని ఎమ్మెల్యే ప్రచారం చేయటం అతని దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు._
_కేసులు వేయించే సంస్కృతి నాది కాదని నీవు నియంత్ర వ్యవహరిస్తుంటే హక్కు ఉన్నవాడు కోర్టును ఆశ్రయిస్తుంటారని అన్నారు._
_టిడిపి హయాంలో తెచ్చిన జీవోలు, నిధులతో మిగిలిన పనులు చేస్తూ తాను అభివృద్ధి చేస్తున్నానటం సిగ్గుచేడున్నారు._
_మూడేళ్ల వైసిపి పాలనలో వినుకొండ అభివృద్ధికి కొత్తగా ఒక్క ఆలోచన ఉందా అని ప్రశ్నించారు._
_గడపగడపకు మీరు తిరుగుతున్న రోడ్లు మేము వేయించినవెనన్న వాస్తవం తెలుసుకోవాలన్నారు._
_నీ విల్లాస్ కోసం కొండ చుట్టూ గిరి ప్రదర్శన రోడ్డు వేస్తూ అభివృద్ధి అంటూ ప్రజలను చేస్తున్న మోసం త్వరలో అర్థం అవుతుంది అన్నారు._
_గతంలో తనపై ఎన్నో ఆరోపణలు చేసిన బొల్లా బ్రహ్మనాయుడు అధికారంలోకి వచ్చాక ఒకటి నిరూపించారని, దమ్ముంటే ఆరోపణల పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు._
_అఖిలపక్షాల సమక్షంలో తాను చర్చకు సిద్ధమని మీ అవినీతి అక్రమాలు నిరూపిస్తామని అన్నారు._
_సమావేశంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు...!!_
addComments
Post a Comment