విజయవాడ (ప్రజా అమరావతి);
దసరా నవరాత్రులు నాల్గవరోజు గురువారం నాడు వివిధ సేవల టిక్కెట్ లు, ప్రసాదాలు అమ్మకాలు ద్వారా రూ. 31 లక్షల 40 వేల 925 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈ ఓ శ్రీమతి డి. భ్రమరాంబ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దసరా శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ఆలయానికి సమకూరిన ఆదాయాన్ని వివరిస్తూ రూ. 500 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ.11 లక్షల 13 వేల రూపాయలు, రూ. 300 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ. 5 లక్షల 81 వేల 700 రూపాయలు, రూ. 100 టిక్కెట్స్ అమ్మకం ద్వారా రూ. 4 లక్షల 94 వేల 100 రూపాయలు ఆర్జించడం జరిగిందని, అలాగే లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 8 లక్షల 98 వేల 650 రూపాయలు, ఇతర సేవలు ద్వారా రూ. 53 వేల 475 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆ ప్రకటనలో ఈ ఓ తెలిపారు.
addComments
Post a Comment