విజయవాడ (ప్రజా అమరావతి);
దసరా నవరాత్రులు తొలిరోజు సోమవారం నాడు వివిధ సేవల టిక్కెట్ లు, ప్రసాదాలు అమ్మకాలు ద్వారా రూ. 26 లక్షల 10 వేల 444 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈ ఓ శ్రీమతి డి. భ్రమరాంబ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా శరన్నవరాత్రులు తొలిరోజు సోమవారం అమ్మవారు స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గా దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రూ. 500 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ. లక్ష 81 వేల 500 రూపాయలు, రూ. 300 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ. 9 లక్షల 67 వేల 500 రూపాయలు, రూ. 100 టిక్కెట్స్ అమ్మకం ద్వారా రూ. 5 లక్షల 13 వేల 600 రూపాయలు ఆర్జించడం జరిగిందని, అలాగే లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 7 లక్షల 07 వేల 160 రూపాయలు, కుంకుమార్చన టిక్కెట్స్ ద్వారా రూ. లక్షా 20 వేలు, చండీ హోమం టిక్కెట్స్ రూ. 68 వేల రూపాయలు, ఇతర సేవలు ద్వారా రూ. 52 వేల 680 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆ ప్రకటనలో ఈ ఓ తెలిపారు.
addComments
Post a Comment