అమరావతి (ప్రజా అమరావతి);
శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ను కలిసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.
మహాకవి గురజాడ అప్పారావు 160 వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని ఐదు వేల కాపీలు ముద్రించిన భూమన కరుణాకర్ రెడ్డి.
కన్యాశుల్కం కాపీలను ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
విజయనగరంలో గురజాడ ఇంటికి కాపీలను బహుకరించి సందర్శకులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపిన భూమన కరుణాకర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.
addComments
Post a Comment