రాష్ట్ర ప్రభుత్వం కాపు సంక్షేమానికి, కాపుల అభివృద్ధికి అనేక పధకాలను అమలు చేసుతున్నదన్నారు.


విజయవాడ (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పధకాల ద్వారా 70 లక్షల 94 వేల 881 మంది కాపులకు 32 వేల 296 కోట్లు అందించామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు  అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అడపా శేషగిరి అన్నారు.  తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం పాత్రికేయుల సమావేశంలో అడపా శేషు  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాపు సంక్షేమానికి, కాపుల అభివృద్ధికి అనేక పధకాలను అమలు చేసుతున్నదన్నారు.


  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కాపుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారన్నారు.  రాష్ట్ర మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులను నియమించారని, శాసన సభలో కాపు సామజిక వర్గానికి చెందిన 26 మంది శాసన సభ్యులుగా ఉన్నారని, ఇద్దరు ఎమ్ ఎల్ సి లుగా ఉన్నారని రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి మేయర్ లు, డిప్యూటీ మేయర్ లు, కార్పొరేషన్ చైర్మన్ లుగా కాపులను నియమించారని అడపా శేషగిరి అన్నారు.  

విద్య, ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం  అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని  ప్రతీ జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని అయన అన్నారు.  విజయవాడలో చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్ పనులు 65 శాతం పూర్తి అయినవని త్వరలో పనులు పూర్తి చేసి ఔటర్ రింగ్ రోడ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 

దేశం లోనే ఎంతో గుర్తింపు పొందిన పధకాలు ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రిని  దేశ వ్యాప్తంగా ప్రశంసించడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు.  ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పధకాలు తీసుకొచ్చిన తరుణంలో కరోనా మహమ్మారి వలన  కుంటుపడి విదేశీ విద్యకు అవరోధం కలిగినప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆర్ధిక సహాయంతో ఎంతో ఆదుకున్న సందర్భాన్ని గుర్తించాలన్నారు.  సచివాలయ వ్యవస్థ వలన దాదాపు 1.20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రికి దక్కిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (DBT) క్రింద వివిధ ప్రభుత్వ పధకాల ద్వారా కాపు సామజిక వర్గానికి చెందిన వారికి అందించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయని వై.ఎస్.ఆర్. ఆసరా క్రింద 7 లక్షల 65 వేల 309 మందికి 1 కోటీ 1 వేయి 416 కోట్లు అందించామన్నారు.  అమ్మ ఒడి పధకం క్రింద 4 లక్షల 4 వేల 583 మంది లబ్ది దారులకు 1 వేయి 715 కోట్లు, చేదోడు పధకం క్రింద 14918 మంది లబ్ది దారులకు రూ. 25.25 కోట్లు, వై.ఎస్.ఆర్. ఉచిత పంటల భీమా క్రింద 4 లక్షల 33 వేల 909 మందికి రూ. 655.12 కోట్లు, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీగా 2 లక్షల 810 మంది రైతులకు రూ. 175.82 కోట్లు, జగనన్న తోడు క్రింద ఒక లక్ష 49 వేల 611 మందికి రూ. 149.61 కోట్లు, జగనన్న వసతి దీవెన పధకం క్రింద లక్షా 42 వేల 661 మందికి రూ. 293.45 కోట్లు, జగనన్న విద్యా దీవెన పధకం క్రింద ఒక లక్షా 92 వేల 662 మందికి రూ. 895.38 కోట్లు, వై.ఎస్.ఆర్. కాపు నేస్తం పధకం క్రింద 3 లక్షల 38 వేల 792 మందికి రూ. 1492 కోట్లు, వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా క్రింద 701 మందికి రూ. 1.50 కోట్లు, వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం క్రింద 2577 మందికి రూ. 18.73 కోట్లు, వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక క్రింద 6 లక్షల 49 వేల 857 మందికి రూ. 4725.73 కోట్లు, వై.ఎస్.ఆర్. రైతు భరోసా క్రింద 7 లక్షల 85 వేల 700 మందికి రూ. 3487.29 కోట్లు, వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పంట రుణాలు పధకం క్రింద 6 లక్షల 3 వేల 887 మందికి రూ. 112.11 కోట్లు, వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ (SHGS) క్రింద 8 లక్షల 77 వేల 589 మంది లబ్దిదారులకు రూ. 310.91 కోట్లు, వై.ఎస్.ఆర్. వాహన మిత్ర పధకం క్రింద 29957 మందికి రూ.104.95 కోట్లు, వై.ఎస్.ఆర్. ఆరోగ్య ఆసరా క్రింద 28 వేల 638 మందికి రూ. 23.28 కోట్లు, వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ క్రింద ఒక లక్ష 33 వేల 925 మందికి రూ. 520.50 కోట్లు, వై.ఎస్.ఆర్. భీమా క్రింద 8 వేల 151 మందికి రూ. 132.87 కోట్లు కాగా నాన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ క్రిందన (NON DBT) క్రిందన  జగనన్న గోరుముద్ద పధకం క్రింద 4 లక్షల 2 వేల 76 మందికి రూ. 274.03 కోట్లు, వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ క్రింద లక్షా 50 వేల 800 మందికి రూ. 229.12 కోట్లు, జగనన్న విద్యా కానుక క్రింద 4 లక్షల 5 వేల 450 మందికి రూ. 202.78 కోట్లు, హౌస్ సైట్స్ క్రింద 2,46,080 మందికి రూ. 12304 కోట్లు, హోసింగ్ క్రింద 121238 మందికి రూ. 3030 కోట్లు లబ్ది చేకూర్చడం జరిగిందని చైర్మన్ శ్రీ అడపా శేషగిరి తెలిపారు.  మొత్తం అన్ని పధకాల క్రింద 70 లక్షల 94 వేల 881 మంది లబ్దిదారులకు రూ. 32,296.37 కోట్ల రూపాయలు అందించామని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి అన్నారు.

ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ధనుంజయుడు ఉన్నారు. 


Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image