*ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ పర్యటన వివరాలు*
అమరావతి (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ *డాక్టర్ కె .ఇక్బాల్ అహమ్మద్ ఖాన్* ఈ నెల 26 తేదీన మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ కార్యలయంలో అందుబాటులొ ఉంటారు . *ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు* మంగళగిరి మెయిన్రోడ్డులోని ఈద్గా ఎదురుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ కార్యలయంలో ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ , పూర్వపు కేసుల విచారణ జరుగుతుంది . రాష్ట్రంలోని *ముస్లింలు , క్రైస్తవులు , సిక్కులు , జైనులు , బౌద్దులు పారసీలు* తమయొక్క అపరిష్కృత సమస్యలను ఫిర్యదులను , వినతులను ఈ సందర్బంగా నేరుగా అందజేసి తగు న్యాయం పోందవలసిందిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె ఇక్బాల్ అహమ్మద్ కోరారు . ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు .
addComments
Post a Comment