శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కని ఏర్పాట్లు చేయడం జరిగింది



ఇంద్రకీలాద్రి: అక్టోబర్ 2 (ప్రజా అమరావతి);


శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కని ఏర్పాట్లు చేయడం జరిగింద


ని రాష్ట్ర డిజిపి కె.రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 


ఆదివారం రాత్రి రాష్ట్ర డిజిపి సరస్వతి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు పెద్ద వేడుకలు ఒకేసారి వచ్చాయి అన్నారు. తిరుపతి బ్రహ్మోత్సవాలు, ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం వలన ఎటువంటి సంఘటనలు తలెత్తకుండా సజావుగా నిర్వహించడం జరుగుచున్నదన్నారు.  బ్రహ్మోత్సవాలకు రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేయగా, సుమారు నాలుగున్నర లక్షల మంది బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారన్నారు.  బ్రహ్మోత్సవాలు పర్యవేక్షణకు నలుగురు ఎస్పీలను నియమించడంతోపాటు,, పార్కింగ్ ప్రదేశాల ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ వంటివి ప్రణాళిక బద్ధకంగా చర్యలు తీసుకోవడం వలన బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసాయన్నారు.  అలాగే ఈ రోజు అమ్మవారిని  పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్ల ద్వారా దర్శించుకుంటున్నారన్నారు. అందరికీ దర్శనం అందేలా, క్యూ లైన్లు ముందుకు ముందు కదిలేలా సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగిందన్నారు. విజయదశమి నుండి రెండు రోజులు పాటు భవానిలు పెద్ద ఎత్తున అమ్మవారికి మొక్కులు తీర్చుకోడానికివస్తారని,  ఇదే స్పూర్తితో సిబ్బంది పనిచేసి ఉత్సవాలు విజయవంతంగా ముగిసేలా కృషి చేయాలని కోరారు.


Comments