కె గంగవరం (ప్రజా అమరావతి);
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం కె గంగవరం గ్రామంలో ప్రేమోన్మాది గుబ్బల వెంకట సూర్య నారాయణ చేతిలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన దేవిక కుటుంబ సభ్యులను పరామర్శించి
బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ ,సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు శ్రీ చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.
ఆదివారం మంత్రి కె గంగవరం మండలంలోని కే గంగవరం గ్రామం లోని మృతురాలి కుటుంబం ఇంటి కి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది పాశవికంగా చర్యని
సమాజంలో ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
దుర్మార్గుడు పట్ల ప్రభుత్వ0 కఠినంగా వ్యవహరిస్తోందని, మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మృతురాలు దిశా అప్ వినియోగిస్తే ఇంతటి ఘటన జరిగి వుండేది కాదని పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారని మంత్రి తెలిపారు. సమాజంలో అనేక మానసిక రుగ్మత తో ఇలాంటి ఘటన లకు పాల్పడుతున్నారని, ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలన్నారు.బాధిత కుటుంబాన్నీ ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి ఇప్పటికే పది లక్షల రూపాయలు ప్రకటించారని మంత్రి తెలిపారు.
addComments
Post a Comment