నెల్లూరు అక్టోబర్ 18 (ప్రజా అమరావతి);
సంక్షేమ పాలన అందిస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలను అందుకుంటున్న ముఖ్యమంత్రి పై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో వెనకడుగు వేసే ప్రసక్తే లేద
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గం టి పి గూడూరు మండల కేంద్రంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి కాకాణి నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన మహిళలు, స్థానికులు వెంట రాగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల కరదీపిక ను అందిస్తూ, ప్రజలతో మంత్రి కాకాణి మమేకమయ్యారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించడం, అర్హతలు ఉండి సంక్షేమం అందని వారికి అందించడం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. దాదాపు 3 మసాలుగా గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు, ప్రతీ గ్రామంలో ప్రజలు ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు వేశారన్నారు. సంక్షేమ పాలన అందిస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలను అందుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్షాలు రకరకాల అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఎవరోధాలు కల్పించినప్పటికి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్బంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మనబడి నాడు నేడు రెండవ దశ అభివృద్ధి పనులకు మంత్రి కాకాణి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాకం అలేఖ్య, యం పి డి ఓ హేమలత, తహసీల్దార్ హమీద్, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment