శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి):
ది.27-10-2022న గాజుల అలంకరణ మహోత్సవం సందర్బంగా శ్రీ అమ్మవారి మరియు ఆలయ అలంకరణ నిమిత్తం ఈరోజు 1,25,000 ల గాజులను విజయవాడ కు చెందిన శ్రీ కనకదుర్గ లలితా పారాయణ బృందం వారు శ్రీయుత ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానం నకు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి శ్రీమతి పి. సుధారాణి గారు, లలితా సహస్ర నామ పారాయణ బృంద సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు శ్రీఅమ్మవారి దర్శనం కల్పించి, శ్రీ అమ్మవారి ప్రసాదం అందజేశారు.
addComments
Post a Comment