అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన క్రిబ్కో చైర్మన్ డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్.
ఈ ఏడాది డిసెంబర్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్ శంకుస్ధాపనకు సీఎంను ఆహ్వనించిన చంద్రపాల్ సింగ్ యాదవ్.
రూ. 300 కోట్లతో మొదటి దశ నిర్మాణం పనులు ప్రారంభించనున్న క్రిబ్కో.
దీంతోపాటు డీఏపీ కాంప్లెక్స్ ఎరువుల తయారీకి సంబందించిన ప్రాజెక్ట్ ఏర్పాటుపై కూడా సీఎంతో చర్చించిన క్రిబ్కో చైర్మన్, సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.
ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ.
ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం, రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం.
సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న సీఎం.
ఈ సమావేశంలో పాల్గొన్న క్రిబ్కో వైస్ చైర్మన్ వల్లభనేని సుధాకర్ చౌదరి, క్రిబ్కో ఎండీ రాజన్ చౌదరి, మార్కెటింగ్ డైరెక్టర్ వీఎస్ఆర్ ప్రసాద్, సీఎంవో అధికారులు.
addComments
Post a Comment