*మంగళగిరిలో గెలిచి చరిత్ర తిరగరాయాలి : లోకేశ్కి చంద్రబాబు దిశానిర్దేశం*
అమరావతి. ( ప్రజా అమరావతి): అత్యధిక మెజార్టీతో మంగళగిరిలో గెలిచి చరిత్ర తిరగరాయాలని నియోజకవర్గ సమీక్షలో మంగళగిరి ఇన్ఛార్జి లోకేశ్కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తాజా సర్వేల ఆధారంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని ఆయన సమీక్షించారు. 1983, 1985 ఎన్నికల్లో మాత్రమే మంగళగిరిలో టీడీపీ గెలిచిందన్నారు. తాను ఓడిపోయినా, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువకాగలిగామని ఈ సందర్భంగా లోకేశ్ అధినేతకు వివరించారు. పార్టీ తరఫున సాయంతో పాటు, తాను సొంతంగా 12కి పైగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ప్రజల మనసులు గెలుచుకున్నట్టు లోకేశ్ తెలిపారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజల్ని చైతన్యం చేయడంతో పాటు వారికి అండగా నిలుస్తున్నామన్నారు. గెలుపు గ్యారంటీ అని అలసత్వం వహించకుండా సమిష్టిగా పనిచేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తిరుగులేని విజయం సాధించేలా వుండాలని చంద్రబాబు సూచించారు.
addComments
Post a Comment