ప్రజాస్వామ్యం దేశంలో విశాఖలో జరిగిన ఘటనలు చూస్తే బాధేస్తుంది.


అమరావతి (ప్రజా అమరావతి);

*జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భేటీ*

*అనంతరం ఇరువురు నేతల ఉమ్మడి మీడియా సమావేశం:-*

*నారా చంద్రబాబు నాయుడు, టిడిపి అధినేత:-*

హైదరాబాద్ నుంచి వస్తూ పవన్ కళ్యాన్ వద్దకు వచ్చాను.

విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానం సరిగా లేదు.

అందువల్లే పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చేందుకు వచ్చాను.

హోటల్ లో ఉన్నారని తెలిసి నేరుగా నేను విమానాశ్రయం నుంచి వచ్చాను.

ప్రజాస్వామ్యం దేశంలో విశాఖలో జరిగిన ఘటనలు చూస్తే బాధేస్తుంది.


ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ విశాఖలో కార్యక్రమం పెట్టుకున్నారు.

ఒక రాజకీయ పార్టీ నేత వచ్చినప్పుడు పోలీసులు సాధారణంగా ఏర్పాట్లు చేస్తారు.

విశాఖలో పవన్ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.

జనసేన వారిపై దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు పెట్టారు.

హోటల్ కు వెళ్లే వరకు పవన్ ను ఇబ్బంది పెట్టారు. పోలీసులు పవన్ ను బయటకు రావద్దు అని చెప్పడం ఏంటి.?

ఇదే ప్రజాస్వామ్యమా....పవన్ వెళుతుంటే వీధి లైట్లు కూడా ఆపేశారు.

పోలీసులు పవన్ వద్దకు వెళ్లి టూర్ లో అభ్యంతరాలు చెప్పారు.

పవన్ హోటల్ లో ఉంటే అక్కడికి వెళ్లి కూడా దారుణంగా వ్యవహరించారు. గదులు సోదా చేశారు.

పవన్ కు నోటీసు ఇచ్చి విశాఖనుంచి పంపించారు...పవన్ వల్ల ఏం సమస్య వచ్చింది...ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది?

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితి ఇది. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఇదే పద్దతి.

ప్రజా స్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ లేదు. రాజకీయ పార్టీలు లేకపోతే ప్రజల సమస్యలపై ఎవరు మాట్లాడుతారు?

రాజకీయ పార్టీల నేతలకే రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ ఉంటుంది?

దాడులు, అక్రమ కేసులు, నిందలు అనేవి రాష్ట్రంలో సాధారణం అయ్యాయి.

నేతలను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు....మనం తిరిగి అడిగితే కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు.

రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆలోచించాలి

మీడియాకు స్వేచ్ఛ లేదు....ప్రజలకు స్వేచ్ఛ లేదు.

ప్రభుత్వ హింసకు ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

విశాఖ ఘటనపై నా మనుసు బాధపడి పవన్ కు సంఘీభావం తెలపాలి అని వచ్చాను.

వైసిపి అంత నీచమైన పార్టీని ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు.

టీడీపీ కార్యాలయంపై మీద దాడి చేసిన ఘటనలో కనీసం కేసు నమోదులేదు.

అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా....ముందు రాజకీయ పార్టీల మనుగడను మనం కాపాడాలి. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చు...ప్రజల సమస్యలపై పోరాడవచ్చు.

ప్రభుత్వం చేస్తున్న తప్పును రాజకీయ పార్టీలు తప్పని చెప్పకూడదా.? 

సిఎం జగన్ ప్రతిపక్ష నేతలను తిట్టించి పైశాచిక ఆనందం పడుతున్నాడు...ఇది శాశ్వతం కాదు అని గుర్తు పెట్టుకోవాలి.

ప్రభుత్వ విధానాలు, ప్రజా స్వామ్య పరిరక్షణపై అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతాం.

ప్రతిపక్ష నేతలు బయటకు వెళితే ఆంక్షలు విధిస్తున్నారు.  పార్టీలు,సిద్దాంతాలు వేరుగా ఉన్నా ..ప్రజాస్వామ్యం కోసం అంతా పోరాడాలి

అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు ఆలోచించాలి...ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోవాలి.

అందరూ ప్రజా స్వామ్య పరిరక్షణకు పని చెయ్యాలి

రాష్ట్రంలో అందరినీ బెదిరిస్తున్నారు. విజయవాడలో అంకబాబు అనే సీనియర్ జర్నలిస్ట్ ఓ పోస్టు ఫార్వార్డ్ చేశారని అరెస్టు చేస్తారా?

ఇక్కడ ఎన్నికలు, పోత్తులు అనేది చర్చ కాదు....ప్రజాస్వామ్యం ముఖ్యం

ఒక ఎమ్మెల్యేను ప్రజా సమస్యపై నిలదీసే పరిస్థితి రాష్ట్రంలో ఉందా.? ప్రభుత్వ అరాచకాలు రాసే ధైర్యం మీడియాకు ఉందా.

ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నం చెయ్యాలి

ప్రజా సమస్యలపై నిలదీస్తాం...పోరాటం చేస్తాం...మెడలు వంచుతా.? ప్రతిపక్షాలు అడిగే వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

కౌలు రైతులకు అన్యాయం జరిగితే సాయం చేసే ప్రయత్నం పవన్ చెయ్యడమే తప్పా.?

ప్రభుత్వం చెయ్యదు....ఇతరులు చేస్తే అడ్డుకుంటున్నారు

పవన్ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు...నన్ను కూడా గతంలో వైజాగ్, తిరుపతిలో అడ్డుకున్నారు.

ఈ రోజు పవన్ కు జరిగింది అని ఇంట్లో పడుకుంటే...రేపు మాట్లాడే వారు ఉండరు

ఒక రాజకీయ పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నా అసెంబ్లీలో సమాధానం చెప్పే వారు. ఒకప్పుడు అంత గౌరవం ప్రతిపక్షాలకు ఉండేది.

ఇప్పుడు ప్రతిపక్షం లేదు....ఇంకో పార్టీ అని లేదు....ఎవరినీ లెక్కపెట్టడం లేదు. దాడులు చేస్తున్నారు.

ప్రభుత్వ తప్పులను ఎండగడితే విమర్శించి పబ్బం గడుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోగా ఉన్నారు..కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఈ తిట్లు పడాల్సి వస్తుంది.

ప్రజాస్వామ్యాన్ని ముందు కాపాడుదాం...ఏ గ్రామానికి అయినా వెళ్లి మీటింగ్ పెట్టే పరిస్థితి తీసుకువస్తాం.

రఘురామకృష్ణరాజుపై ఇలాగే అటాక్ చేస్తే నేనే లేఖ రాశాను..నేనే ముందు స్పందించాను.

లేకపోతే ఆరోజే రఘురామను చంపేసేవారు.

ప్రభుత్వంపై రాజకీయ పోరాటం ఉమ్మడిగా జరగాలి. న్యాయ పరంగానూ పోరాటం జరగాలి.

Comments