రాష్ట్రంలో మార్పు మొదలైంది. మైనారిటీ సమావేశం ద్వారా ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

 *పార్టీ కేంద్ర కార్యాలయంలో ముస్లిం మైనారిటీ సెల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*


*పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు*


*సభలో అధ్యక్షుల వారి ప్రసంగం:-*


రాష్ట్రంలో మార్పు మొదలైంది. మైనారిటీ సమావేశం ద్వారా ఇది స్పష్టంగా కనిపిస్తుంది.


జగన్ ఎన్నికల తరువాత జైలుకు వెళ్లడం ఖాయం.  ఆ పార్టీ బంగాళాఖాతంలో కలవడం ఖాయం.

మత సామరస్యం కాపాడిన పార్టీ తెలుగు దేశం పార్టీ

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీలకు ఒక్క పని చేశారా?

దేశంలో మొదటి సారి మైనారిటీలకు కార్పొరేషన్ పెట్టింది టిడిపి

ఉర్థూను రెండో అధికారిక భాష చేసింది టిడిపి

దీనిపై జగన్ కు, వైసిపి నేతలకు డౌట్ ఉంటే గూగుల్ ను అడిగితే చెపుతుంది.

హైదరాబాద్ లో ఉర్థూ యూనివర్సిటీ పెట్టించిన ఘనత తెలుగు దేశం పార్టీది

హజ్ హౌస్ కట్టి, హైదరాబాద్ నుంచి నేరుగా ఫ్లైట్స్ పెట్టిన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం

అసెంబ్లీ ఎదురుగానే నాడు హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టాం. 

మైనారిటీలపై టిడిపికి ఎప్పుడూ ప్రత్యేకమైన ప్రేమ ఉంది.

రాష్ట్ర విభజన తరువాత కర్నూలులో మళ్లీ ఉర్థూ యూనివర్సిటీ పెట్టాం

విజయవాడలో, కడపలో హజ్ హౌస్ లు కట్టాం

ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇచ్చాం.

దుల్హన్ పథకం మనమే తెచ్చాం.....ఇప్పుడు ఇస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి

•దోచుకోవడం...దాచుకోవడం తప్ప ఈ సిఎంకు మరేమీ చెయ్యరు

దుల్హన్ పథకానికి ఆంక్షలు పెట్టాడు...10తరగతి చదవాలి, కారు ఉండకూడదు, 300 యూనిట్ల కరెంటు వాడకూడదు అని ఆంక్షలు పెట్టారు. పథకం ఇవ్వను అంటున్నాడు.

పక్క జిల్లా వారిని పెళ్లి చేసుకున్నా పథకం వర్తించదు అని ఆంక్షలు పెట్ట్టింది ఈ ప్రభుత్వం

నాడు రూ.163 కోట్లతో 32,722 మంది మైనార్టీ వధువులకు దుల్హన్ సాయం.

జగన్ రెడ్డి మైనార్టీ వివాహాలకు రూ.లక్ష ఇస్తానని ఉత్తుత్తి హామీ ఇచ్చాడు.

విదేశీ విద్యోన్నతి పథకంలో 527 మైనార్టీ విద్యార్థులను విదేశాలకు పంపాము.

ముస్లిం యువతకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మూడు లక్షల రుణం ఇచ్చాం.అందులో లక్ష సబ్సిడీ ఇచ్చి యూనిట్లు ఏర్పాటుకు అవకాశం ఇచ్చాము. 

ఏటా 10 వేల మంది ముస్లింలు రుణాలు పొంది వ్యాపారాలు పెట్టుకున్నారు.

•నాడు 316 దర్గాలు, 1,365 మసీదులు, 43 ఖబరస్థాన్లు, 66 ఈద్గాలు, 164 ముస్లిం ప్రార్థనా మందిరాలకు మరమ్మతులు, నిధులు ఖర్చు చేశాం.

భారత దేశ చరిత్రలో ముస్లిం పెద్దలకు ఆర్థిక సాయం చేసిన ఏకైక ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం.

ఇమామ్ లకు, మౌజన్ లకు అండగా నిలిచిన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం

టిడిపి ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు ఆస్తులకు రక్షణ కల్పించాం. 

ఎవరైనా వక్ఫ్ బోర్డు ఆస్తులు వైపు చూస్తే తాట తీస్తాం అని నాడు హెచ్చరించాం

అయితే ఇప్పుడు వేల కోట్ల వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి

మనం ఏమారితే...సొంత ఆస్తులు కూడా ఇలాగే కొట్టేస్తారు

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి ప్రాణాలు తీశారు.

రైల్వే ట్రాక్ పై భార్యా బిడ్డలను కట్టేసి కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకుంది.

ఈ ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు.

బలహీన వర్గాల నాయకుడు అయ్యన్నను తప్పుడు కేసులో అరెస్టు చేశారు.

వివేకా హత్య కేసు పరిణామాలను పక్కదారి పట్టించేందుకే అయ్యన్నను అరెస్టు చేశారు.

రంజాన్ తోఫా, దుకాన్ మకాన్, విదేశీ విద్యాధరణ పథకం, దుల్హన్ పథకం, మైనార్టీ కార్పొరేషన్ నిధులు రద్దు చేశారు.

సాక్షి పత్రికకు ఏడాదికి 500 కోట్లు ఇస్తారు...దుల్హన్ పథకానికి మాత్రం నిధులు లేవు అంటారు.

సాక్షి గుమస్తాలకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తారు...ముస్లింలకు మాత్రం సాయం చెయ్యరు.

షరీఫ్ మండలి చైర్మన్ గా ఉండి నిజాయితీగా పని చేశారు. ప్రాణం పోయినా తప్పు చెయ్యను అని చెప్పారు.

ఎంతో నిజాయితీ పరుడు అయిన షరీఫ్ ను ముస్లింలకే పుట్టావా అని మండలిలో అడుగుతారా ?

మాజీ మంత్రి ఫరూక్ కాలిగోటికి సరిపోని వాళ్లు సైతం అయనను విమర్శిస్తున్నారు.

ముస్లిం సంక్షేమం, అభివృద్దిపై చర్చ జరగాలి. ముస్లిం వర్గానికి పెద్దగా ఆస్తులు ఉండవు. కష్టపడి పనిచేసి జీవితాలు సాగిస్తారు.

పేదరికంలో ఉండే ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పనిచెయ్యాలి

జగన్ ప్రజలకు నొక్కేది ఉత్తుత్తి బటన్....బట్ ఇన్ ద్వారా మద్యం, ఇసుక డబ్బు జగన్ కు చేరుతుంది.

మద్యం డబ్బు ఎటుపోతుంది.....జగన్ బ్రాండ్ల ద్వారా దోచేస్తున్నారు.

రాష్ట్రంలో కబ్జాలు, కుంభకోణాలు, బెదిరింపులు, అవినీతి బాగా పెరిగింది

నా పోరాటం నాకోసం కాదు....మీ కోసం.

రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ దెబ్బతిన్నాయి. అనంతపురంలో కరెంట్ ప్రమాదంలో నలుగురు చనిపోయారు.

మహిళ తన ఇంటిని అమ్ముకోకుండా అడ్డుపడిన వారు మంత్రులా...నర హంతకులా?

రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. అంతా కంకణం కట్టుకుని రాష్ట్రం కోసం పోరాడాలి.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసిపికి అవే చివరి ఎన్నికలు.

వైసిపి కుప్పంలో గెలవడం కాదు...ముందు పులివెందుల లో గెలువు

బాబాయిని చంపింది నేనే అని చెప్పి పులివెందులలో ఓటు అడుగుతారా?

కోడి కత్తి డ్రామా ఏమయ్యింది?

పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉంటే ఆయన ఇంటి వద్ద రెక్కీ చేస్తారా?

అందరినీ చంపేస్తావా...బాధపెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి.

Comments