కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు

 కర్నూలు (ప్రజా అమరావతి);  కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు


. నగరంలోని రాజ్ విహర్ కూడలి వద్ద హైకోర్టు సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులచే మానవహారం  నిర్వహించారు. వెనుకబడిన రాయలసీమకు హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని వారు కోరారు. కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు విషయంలో అడ్డుకుంటున్న రాజకీయ పార్టీలను తరిమికొడతామని వారి హెచ్చరించారు. ఒక రాజధాని వద్దు మూడు రాజధాని ముద్దు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటసాని_రాంభూపాల్_రెడ్డి, హాఫీస్_ఖాన్, ఎంపీ ,సంజీవ్కుమార్, 41 వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి శ్వేతారెడ్డి  , వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Comments