రైతులకు స్ధిరమైన ధర ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటాం.

 అమరావతి :10,నవంబరు (ప్రజా అమరావతి): ఆక్వా రైతులతో సమావేశం 

-*మంగళగిరిలోని  ఏపీఐఐసీ  కాన్ఫరెన్స్ హాలులో  సమావేశం  నిర్వహణ.


* సమావేశానికి  హాజరైన   ఏపీ మత్స్య & పశు  సంవర్ధక  & డెయిరీ   డెవలప్మెంట్ శాఖ   మంత్రి  డాక్టర్ సీదిరి  అప్పలరాజు, మత్స్య శాఖ  స్పెషల్  సీఎస్ పూనం  మాలకొండయ్య,మత్స్య శాఖ  కమిషనర్ కన్నబాబు.


* మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కామెంట్స్


*ఆక్వా ఎగుమతుల విషయంలో  కొంత ఇబ్బందులున్నాయి.


* చైనా మార్కెట్ పూర్తిగా షట్ డౌన్ అవడంతో ఎగుమతులకు ఇబ్బంది.


* కేంద్రం చైనా ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే ఉపయోగం.


* రైతులకు స్ధిరమైన ధర ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటాం.


*  ఆక్వాకు  సంబంధించిన కంపెనీలు,ఫీడ్,కల్చర్ చేసే వారు,రైతులు,స్టేక్ హోల్డర్లు అందరితో సమావేశమయ్యాం మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.

* ఆక్వా  రైతులకు స్ధిరమైన రేట్లను నిర్ణయిస్తామన్న మంత్రి

* 100 కౌంటుకు 210 రూపాయలు నిర్ణయించిన మంత్రి డాక్టర్ సీదిరి  అప్పలరాజు.

*  ఆక్వా  రైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది.

* ఆక్వా  రంగంలో ప్రతిష్టంభనలకు కారణం విదేశీ మార్కెట్ లో ఒడిదుడుకులే.

* రైతులు,ఆక్వా కంపెనీలు సమన్వయం కుదిరేలా రేటు నిర్ణయించాం.

* క్రాప్ హాలిడే(పంట విరామం) అనే మాటే లేదు.

* రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


* పది రోజుల పాటు ఇవే రేట్లు ఉంటాయి.

* పది రోజుల తరువాత మరోసారి  సమీక్ష  నిర్వహిస్తాం.

* కేంద్ర ప్రభుత్వానికి మా రిప్రజెంటేషన్ ఇచ్చాం.

* మాది రైతుల ప్రభుత్వం  మంత్రి  డాక్టర్  సీదిరి  అప్పలరాజు.

Comments