పతనంతిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల భక్తుల బస్సుకు ప్రమాదం
ప్రమాదంపై సీఎం ఆరా, సహాయక చర్యలకు ఆదేశం
క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చూడాలని ఆదేశం
అమరావతి (ప్రజా అమరావతి);:
శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికుల బస్సు పతనంతిట్ట వద్ద ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సీఎంఓ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వారికి సరైన సహాయం అందించేలా చూడాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడమే కాకుండా, యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన భక్తుల బృందం మొత్తం 2 బస్సుల్లో 84 మంది శబరిమల వెళ్లారని, ఈ బస్సులు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఉదయం 8:10 గంటలకు పతనంమిట్ట వద్ద ఒక బస్సు ప్రమాదానికి గురైందని తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణిస్తున్నారని, 18 మంది గాయపడ్డారని, కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ౪గురికి చికిత్స అందిస్తున్నామని, ఇందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నారని, వారికి వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పతనంతిట్ట జిల్లా కలెక్టర్తో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
addComments
Post a Comment