కొల్లిపర (ప్రజా అమరావతి); కొల్లిపర లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మూత్రం నిమిత్తము కొల్లిపర లోని కరెంట్ ఆఫీస్ రోడ్లోకి వెళ్ళగా అక్కడ చెడు వ్యసనాలకు బానిసైనా నలుగురు వ్యక్తులు ఆ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి చంపుతానని బెదిరించి వారి వద్ద నుండి 1700/- రూపాయలను నగదును దొంగతనం చేయగా వారిలో ఒక విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆ నలుగురు ముద్దాయిలలో
1) *తూమాటి శ్యాం కుమార్ @ సన్నీ*
2) *మండ్రు రాజ్ కుమార్@ పెద్ద సన్నీ*
3) *అమిరే ఆనంద్ కిషోర్*@ *చోటు*
కొల్లిపర గ్రామానికి చెందిన
ముగ్గురుని ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం అయినది.
చట్ట వ్యతిరేకమైన పనులు మరియు అసాంఘిక కార్యకలాపాలలో పాల్పడిన వారిపై కఠిన చర్యలు
తీసుకోబడునని కొల్లిపర ఎస్సై ఆర్.రవీంద్రారెడ్డి తెలియజేశారు.
addComments
Post a Comment