టీడీపీ ముఖ్య నేతలను కలిసిన శిష్ట్లా లోహిత్



 *- టీడీపీ ముఖ్య నేతలను కలిసిన శిష్ట్లా లోహిత్


 *- తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో సందడి* 

 *- కొనకళ్ళ, మాగంటి, దేవినేని, బచ్చుల, కొల్లుతో సమాలోచనలు* 


అమరావతి, నవంబర్ 19 (ప్రజా అమరావతి): టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ శనివారం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను కలిశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుండి టీడీపీ ముఖ్య నేతలంతా విచ్చేశారు. ఇదే సమావేశానికి హాజరైన శిష్ట్లా లోహిత్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరినీ కలిసి కొద్దిసేపు సందడి చేశారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు చెందిన కొనకళ్ళ నారాయణ, మాగంటి బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, బచ్చుల అర్జునుడు, కొల్లు రవీంద్ర తదితరులతో శిష్ట్లా లోహిత్ సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా వీరందరితో టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించినట్టు సమాచారం. టీడీపీ ముఖ్య నేతలతో ఎంతో కలివిడిగా శిష్ట్లా లోహిత్ ఉండడం ఆహ్లాదకర వాతావరణాన్ని తలపించింది.

Comments