అమరావతి (ప్రజా అమరావతి);
*జగనన్న విద్యా దీవెన*
*పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ – క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు*
*జులై – సెప్టెంబర్ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ. 694 కోట్లను సీఎం శ్రీ వైఎస్ జగన్ నేడు (30.11.2022) మదనపల్లెలో బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్*
*గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీఇంబర్స్మెంట్కు 2017 సంవత్సరం నుండి పెట్టిన బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 12,401 కోట్లు*.
*పేద విద్యార్ధులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేవు. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందిని చదివించవచ్చు*.
*జగనన్న విద్యా దీవెన*
పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం
*జగనన్న వసతి దీవెన*
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్న శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం
కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్ధిక సాయం నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ.
గత ప్రభుత్వంలో ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులకు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు, అరకొరగా ఇచ్చిన ఫీజు రీఇంబర్స్మెంట్ కూడా సంవత్సరాల తరబడి జాప్యంతో, భారీగా బకాయిలు పెట్టిన పరిస్ధితి, భోజన, వసతి ఖర్చులు దేవుడెరుగు, ఇచ్చిన ఫీజు రీఇంబర్స్మెంట్ సైతం అరకొరగా ఇచ్చిన గత ప్రభుత్వం.
గత ప్రభుత్వ బకాయిలు దాదాపు రూ.1,778 కోట్లతో కలిపి శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన క్రింద రూ. 9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన క్రింద రూ. 3,349 కోట్లు అందించింది. ఇప్పటివరకు శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం పిల్లల చదువులకు అందించిన మొత్తం ఆర్ధిక సాయం రూ. 12,401 కోట్లు.
addComments
Post a Comment