సోమవారం ప్రజాఫిర్యాదుల స్వీకరణ "స్పందన" కార్యక్రమం

 *సోమవారం ప్రజాఫిర్యాదుల స్వీకరణ "స్పందన" కార్యక్రమం*


*: పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయంలో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమం నిర్వహణ*


*: అధికారులతో సహా ప్రతి ఒక్కరూ కొవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి*


*: జిల్లా కలెక్టర్ బసంత కుమార్*



పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), డిసెంబర్ 24 (ప్రజా అమరావతి):


ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకోసం ఈనెల 26వతేదీన సోమవారం "స్పందన" గ్రీవెన్స్ కార్యక్రనాన్ని యథాతథంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా చేపడుతున్నట్లు తెలిపారు.


పుట్టపర్తి కలెక్టరేట్లో కొన్ని మరమ్మతు పనులు జరుగుతుండగా, వచ్చే సోమవారం పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయంలో జిల్లా స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతలు స్వీకరిస్తారు. జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమం జిల్లా కేంద్రంలోని పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 9.30 గంటల నుండి స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు వారి వారి సమస్యలను వినతులు రూపంలో అందజేయాలని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీ, ఆధార్ కార్డ్ నకలు మరియు ఫోన్ నెంబర్ అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు మస్కు ధరించాలని సామాజిక దూరం పాటించాలన్నారు.



Comments