విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం


నెల్లూరు, డిసెంబర్ 27 (ప్రజా అమరావతి): ఎవరి ఊహకు అందని విధంగా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం


చుడుతూ, ప్రతిఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  కృషిచేస్తున్నారని రాష్ట్ర  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 మంగళవారం ఉదయం తోటపల్లి గూడూరు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలనే లక్ష్యంతో  ట్యాబ్ ల పంపిణీకి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా విద్యార్థులు అన్ని సమయాల్లో ఉపయోగించుకునేలా బైజుస్ కంటెంట్ తో ట్యాబ్ ను రూపొందించినట్లు చెప్పారు. విద్యార్థులకు ఏం కావాలో ముందుగా తెలుసుకుని, ఆ మేరకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సమకూరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. పోటీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియం సత్ఫలితాలనుస్తుందని, విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను సక్రమంగా వినియోగించుకుంటూ తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా విద్యార్థులు రాణించాలని పిలుపునిచ్చారు.  నాడు నేడు పనులతో పాఠశాలల రూపు రేఖలు మార్చిన ముఖ్యమంత్రి, అమ్మ ఒడి పథకంతో తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. తల్లిదండ్రుల ఆలోచనలను గౌరవిస్తూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నతంగా రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.  తోటపల్లి గూడూరు మండలంలో రూ. 1.76 కోట్ల విలువైన 549 ట్యాబ్లను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందిస్తున్నట్లు చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం మీద రూ. 10 కోట్ల విలువైన 3130 ట్యాబ్ లను అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు  బైజుస్ కంటెంట్ తో రూపొందించిన ట్యాబ్ లను పంపిణీ చేశారు. జగనన్న క్రీడా సంబరాల్లో విజేతలైన విద్యార్థులకు నగదు పురస్కారాలను అందించారు. 

  ముందుగా పాఠశాలల అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విద్యార్థుల ప్రసంగాలు, ట్యాబ్ల పనితీరు, ఉపయోగాల గురించి ఆంగ్లంలో విద్యార్థులు వివరించిన తీరుకు అందరూ  ముగ్థులయ్యారు. 

 ఈ కార్యక్రమంలో  ఎంపీపీ స్వర్ణలత, జడ్పిటిసి శేషమ్మ, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, ఎంపీడీవో హేమలత, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, హెచ్ఎం రియాజ్ అహ్మద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ధనుంజయ కుమార్, విజయ డెయిరీ మాజీ చైర్మన్ సుధీర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


Comments